Showing posts with label పూజలు. Show all posts
Showing posts with label పూజలు. Show all posts

Tuesday 17 January 2017

సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

శ్రీమద్రామాయణంలో సుందరకాండ ఐదవది. సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

సుందరకాండంలో హనుమంతుడు శతయోజన విస్తీర్ణం గల సముద్రమును ఆధారంలేని ఆకాశమార్గంలో పయనించి, ఆటంకాలను ఎదుర్కొని లంకాపట్టణములో ఒంటరిగా ప్రవేశించాడు. లంకలో అన్నిచోట్ల సీతను అన్వేషించి, అశోకవానములో శింశుపావృక్షమూలమున దీనస్థితిలో ఉన్న సీతను కనుకొన్నాడు.
తల బలప్రాక్రమములను శత్రువులకు తెలియజేయుటకు వనములను, ఉద్యానవనములను, ప్రాసాదములను ధ్వంసం చేసాడు. అక్షకుమారుడులాంటి రాక్షస వీరులను ఎందరినో సంహరించాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి రావణ సభకు వెళ్లాడు. రావణునికి హితము పలికాడు. రాక్షసులు తన తోకకు నిప్పు పెట్టగా ఆ మంటలతో లంకానగరాన్ని దహనం చేసాడు.
స్వామికార్యము, స్వకార్యము నెరవేర్చి కార్యమును సానుకూలము చేసుకొని, తిరిగి సముద్రాన్ని లంఘించి వానరులను కలుసకుకొని సీతావృత్తాంతం చెలియజేసాడు.
హనుమంతుడు తనకు అప్పగించిన పనిని విజయవంతంగా నెరవేర్చుటకు అతడు పడిన శ్రమ, శక్తియుక్తులు కార్యసాధకుడు ఎట్లు ఉండవలెనని సుందరకాండ వలన తెలుస్తున్నది.
కార్యము అనగా మంచిపని. ఒక కార్యము చేయునప్పుడు మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి. వాటిని ఓర్పుతోను, నేర్పుతోను, శక్తియుక్తులతోను అధిగమించాలి.
హనుమంతుడు సీతాన్వేషణముకై సముద్రమును వాయు మార్గంలో లఘించుచుండగా మొదట మైనాకుడు సముద్రములోనుంచి పైకి వచ్చి తనపై కొంతసేపు విశ్రాంతి తీసుకొని పొమ్మన్నాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు.
మైనాకుడు సత్యగున ఆటంకము. కావున కార్య సాధకుడు మధ్యలో ఆగరాదు. రాముని కార్యము నెరవేర్చుటకు వెళుతున్నానని మైనాకుని మృదువుగా స్పృశించి, ప్రియవచనములతో స్వస్థత పరచి ఓర్పుగాను, నేర్పుతోను ఆటంకమును అధికమించి ముందుకు సాగాడు.
కొంతదూరము పోయిన తరువాత, దేవతలు పంపగా వచ్చిన సురస అను నాగాస్త్రీ హనుమంతుని అడ్డం నిలిచింది. హనుమంతుడు ముక్తిక్తితో, ఉపాయముతోను ఆమె నోటి యందు ప్రవేశించి బయటకు వచ్చెను. ఇది రజోగుణ సంబంధిత ఆటంకము. దీనిని ముక్తితో దాటెను.
మరికొంత దూరం ప్రయాణించగా ఛాయా గ్రాహియైన సింహిక అను రాక్షసస్త్రీ హనుమంతుని ఛాయను పట్టుకొని క్రిందికి లాగినది. ఇది తమోగుణ ఆటంకము. హనుమంతుడు సూక్షరూపం ధరించి, సింహికనోటిలో ప్రవేశించి ఆమె అవయవములను తన గోళ్ళతో పెకిలించి హతమార్చాడు.
కార్యసాధకుడు తనకు ఎదురైన సత్త్య, రజస్తమో ఆటంకములను ఓర్పు, నేర్పు, ముక్తి, శక్తిని ఉపయోగించి అధికమించెను.
లంకాపట్టణం చేరిన హనుమంతుడు తన స్వరూపమును చిన్నది చేసికొని సంచరించెను. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాడు. సురస, సింహికలను అధిగమించునపుడు, లంకాపట్టణంలో సీతాన్వేషణ చేయునపుడు సూక్ష్మరూపాన్ని ధరించాడు. సముద్రము లంఘించునపుడో, అశోకవనమును ధ్వంసము చేయునపుడు, రాక్షసులతో యుద్ధము చేయునపుడు, లంకా దహనము చేయునపుడు శరీరాన్ని పెంచాడు. పరిస్థితులబట్టి ప్రవర్తించాడు.
కార్యము నేరవేరాలనేదే దేశకాల పరిస్థితులను బట్టి కార్యసాధకుడు ప్రవర్తించాలి.
“తతః శరీరం సంక్షిప్య” (సుం. 1-205)
రావణుని అంతః పురంలో వివిధ భంగిమలతో అర్థనగ్నముగాను, నగ్నముగాను ఉన్న సౌందర్యవంతులైన స్త్రీలను చూచాడు. ఎన్నోరకములైన సువాసనలతో కూడిన ఆహార పదార్థములు పరికించాడు. కాని, హనుమంతుని మనస్సు చలింపలేదు. సీతను గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన అతని మనస్సులో లేదు. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము కలిగిన జితేంద్రియుడు హనుమంతుడు.
కార్యసాధకుని మనస్సు వికారములకు లోనుకారాడు. మనోవికారము లేనప్పుడు, ఏది చూచినను దోషములేదు. ఆ కార్యసాధకుని కార్యం మీదనే దృష్టి ఉంటుంది.
శ్లో||మనోహిహేతుః సర్వేషామిన్ద్రి యాణాం ప్రవర్తెతే
శుభాశుభస్వవ్స్థాసు తచ్చమే సువ్యవస్థంమ్ (సుం. 11-41)
ప్రలోభములకు లొంగరాదు, విషయము లందు చలింపకూడదు.
హనుమంతుడు లంకలో అన్ని ప్రదేశములను సీతకై వెదకి ఆమె కనుపించక పోవుటచే దిగులు చెంది నిరుత్సాహ పడెను. తన శ్రమ వృథా అయినదని దైన్యము నొందెను.
కార్యసాధకునికి దైన్యము పనికిరాదు. నిరుత్సాహము చెందినను, దిగులు చెందినను కార్యము సిద్ధింపదు. కార్యనిర్వాహణకు దిగులు వదలి ధైర్యము వహించాలి. సర్వకార్యములు ఆ నిర్వేదము వలననే సానుకూలమగును.
శ్లో|| అనిర్వేదః శ్రియోమూలమనిర్వేదః పరంసుఖమ్
అనిర్వేదోహిసతతం సర్వార్దేషు ప్రవర్తకః (సుం. 12-10)
శక్తివంతుడైన హనుమంతుడు వెంటనే దైన్యమును విడచి, ధైర్యము తెచ్చుకొని సీత కనిపించునంతవరకు వెదకెదనని ధృడచిత్తుడయ్యెను. మనస్సును దిటవు చేసుకొన్నాడు. బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించేది. చచ్చి సాధించేది ఏమున్నది? బ్రతికి ఉంటే సీతమ్మను కనుగొని రామయ్యకు చెప్పవచ్చు. మంచి కార్యములు చేయ వచ్చునని విరక్తిని వదలి సీతాన్వేషణకు ఉపక్రమించాడు.
శ్లో|| వినాశే బహావోదోషా జీవన్ భద్రాణిపశ్యంతి
తస్మాత్ర్వాణాన్ ధరిష్వామి ధ్రువో జీవిత సంగమః (సుం. 13-47)
ఇంతవరకు హనుమంతుడు తన శక్తియుక్తులను ఉపయోగించాడు. పురుషప్రయత్నం ఎంతచేసినా కార్యసాధకుడు దైవసహాయం కూడా కోరాలి. పురుష ప్రయత్నము, దైవానుకూలత ఉన్నప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది.
శ్లో|| కచ్చి త్పురుష కారంచదైవంచ ప్రతిపద్యతే (సుం. 36-19)
సీత కనబడునట్లు అనుగ్రహించుమని, హనుమంతుడికిఉ వసు, రుద్ర, ఆదిత్య, అశ్వనీదేవతలను ప్రార్థించాడు. లక్ష్మణ సహితుడైన రాముని, జనకాత్మజ సీతను, యమ, వాయువులను కార్యసిద్ధికోరకు స్మరించి అశోకవనములోనికి ప్రవేశించి దీనముగా ఉన్న సీతాన్వేషణఉ శింశుపావృక్షము మూలమున కూర్చొనియుండుట చూచినాడు. హనుమంతుని ప్రయత్నం, దైవానుకూలత వలెనే తను కనుగొనగలిగినాడు. అంతా దైవ నిర్ణయం వలన జరుగుతుంది.
శ్లో|| వసూన్ రుద్రాం స్తథాదిత్య నశ్వినౌ మరుతోపిచ
నమస్కృత్యా గమిష్యామి రక్షసాం శోకవర్ధన (సు. 13-56)
శ్లో|| నమోస్తు రామాయ స లక్ష్మణామ
దేవ్వైచ తస్త్య జనకాత్మజాయ
నమోస్తు రుద్రేంద్ర యమానితేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః (13-59)
సీతను చూచినా హనుమంతునికి ఈమె సీతయేనా? అను సందేహము వచ్చెను. పండితుడు కావున యుక్తి యుక్తములైన హేతువులతో ఆమె సీతయే అని నిర్థారణ చేసికొనెను. రావణుడు సీతను అపహరించి లంకకు తీసికొని వస్తున్నపుడు సీత కొన్ని ఆభరణములను తన చీరను చింపి ఆ ఉత్తరీయములో మూటగట్టి ఋష్యమూక పర్వతముపై ఉన్న వానరుల మధ్య జారవిదచినది. ఆమె వదలిన ఆభరణములు ఇప్పుడు ఆమె శరీరముపై లేవు.
రాముడు సీతవద్ద ఏ ఆభరణములు ఉన్నాయని చెప్పెనో అవన్నియు సీత శరీరముపై ఉన్నవి.
నగలను మూటగట్టి ఋష్యమూకముపై విడచినది. ఆ ఉత్తరీయము రంగు ఇప్పుడు ఈమె ధరించిన చీర రంగు ఒకటిగానే ఉన్నవి.
ఈమె రూపము రాముని రూపమునకు తగినట్లు ఉన్నది.
రావణుడు ప్రాతఃకాలమున సీతతో మాట్లాడిన విధానము గమనించిన హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ణయించుకొనెను.
కార్యసాధకుడు యుక్తాయుక్తముగా, హేతుబద్ధముగా విచారించి తన కార్యము సానుకూలమయ్యేట్లు చూసుకోవాలి. కార్యసాధనకు కోపము, అహంకారము, దురభిమానము పనికి రాదు. ఇవి కలిగియున్నవారి కార్యము నెరవేరదు. తనకేమి తెలియకున్నను తెలిసిన వానివలె నటిస్తే కార్యము చెడుతుంది.
శ్లో|| ఘాత యంతి హి కార్యాణి దూతాః పండితమానినః (సుం. 30-38)
వివేకము కలిగి ఉండాలి. ఓర్పు ఉండాలి. కోపము పనికిరాదు. కోపచేసెదరు. ము వలన విచక్షణా జ్ఞానము కోల్పోయి చేయరాని పనులు చేసెదరు. తన కోపము వానన తనకే కాక తన ఆప్తులకు కూడా ఆపద సంభవిస్తుంది.
శ్లో|| వాచ్యావాచ్యం ప్రకుపితోనవిజానాతి కర్హిచిత్
నాకార్యమస్తి క్రుద్దస్య నావాచ్యం విద్యతే కృచిత్ (సుం.55-6)
రావణుని ఆజ్ఞానుసారము రాక్షస భటులు హనుమంతుని తోకకు నిప్పు అంటించారు. రావణుని మీద కోపముతో హనుమంతుడు లంకాపట్టణము దహనం చేశాడు. కోపంలో సీత లంకలో ఉన్నదన్న విషయాన్ని మరిచాడు. లంకా దహనమైన తరువాత సీత కూడా మంటలలో తగులబడినదేమో అని విచారిస్తాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తున్న చారిణుల వలన సీత క్షేమంగా ఉందని తెలిసికొని సంతోషిస్తాడు. కార్య సాధకునికి నిగ్రహం కావాలి. కోపంతో తొందర పడితే కార్యము చెడిపోతుంది.
సీతాన్వేషణము చేసి తిరిగి సముద్రమును లఘించి వానరశ్రేష్ఠుల వద్దకు వచ్చి తను సీతను ఎలా కనుగొనినది వివరంగా చెప్పాడు. ఇంత కార్యము సాధించిననూ హనుమంతునిలో అహంకారము లేదు. ఈ కార్యము నా వలన జరిగినదని చెప్పలేదు. మీ ఆశీస్సుల వలన రాముని దయ వలన సీతను చూడగలిగినానని పలికాడు.
మహాత్ములు తమ శక్తి సామర్థ్యములతో కార్యము నెరవేర్చిననూ గర్వపడరు. అహంకారపూరితులు గారు. దైవసహాయము వలన జరిగినదని భావిస్తారు.
శ్లో|| రాఘవస్య ప్రభావేన భవ తాం చైవ తేజసా
సుగ్రీవస్యచ కార్యార్థం మయా సర్వమనుష్టితమ్ (సు 58-165)
సుందరకాండములో కార్యసిద్ధికి ఏమీ ఉండాలో, ఎట్లా ఉండాలో హనుమంతుని ద్వారా తెలిసికొని, దానిని ఆచరణలో ఉంచిన కార్యసిద్ధి కలుగుతుంది అనే దానిలో అంతరార్థము ఇదే.
కార్యసాధకునికి ఓర్పు, నేర్పు, శక్తియుక్తులు, ధైర్యము వినయము, వివేకము, యుక్తాయుక్త పరిజ్ఞానము ఉండాలి.
దైన్యము, కోపము, అహంకారము, దురభిమానము, గర్వము పనికిరాదు.
కేవలము మన ప్రయత్నముపైనే ఆధారపడక దైవ సహాయం కూడా అర్థించాలి. పురుష ప్రయత్నం దైవానుకూలత రెండూ ఉన్నప్పుడే కార్యసిద్ధి జరుగుతుంది. ఇది హనుమంతుని ద్వారా సుందరకాండములో చెప్పబడి యున్నది. సుందరకాండము పారాయణ చేసి విషయములను అర్థం చేసుకొని నిజజీవితంలో ఆచరిస్తే కార్యసిద్ధి కలుగుతుంది.
భక్తికి, శక్తికి, యుక్తికి హనుమంతుడే ఆదర్శము. అతని స్మరణవలన అన్నీ కార్యములు నిర్విఘ్నముగా నెరవేరుతాయి.
ఆంజనేయుడు మనం మధ్యనే ఉన్నాడు. ఎందరో భక్తులు ఆయనను పూజించి ఆయన సాక్షాత్కారాన్ని పొందగలిగారు. హనుమంతుడు మహాతత్త్వ పండితుడని ఉపనిషత్తుల సారాంశం. రామ మంత్ర రహస్యాన్ని పురాణకాలపు ఋషులందరు ఆంజనేయుని నుంచే గ్రహించారని తెలుస్తోంది. సమస్త పురాణాలలో ఆంజనేయుని ప్రస్తావన ఉంటుంది. నిరంతర రామనామ స్మరణంతో భక్తిలో మునిగిపోయే హనుమంతుడు తన భక్తులకు ఎటువంటి ఆపదలు కలుగనీయడు. కార్య సాధకుడు కాబట్టి తన భక్తుల కార్యములను నిర్విఘ్నంగా ముందుకు సాగెట్లు చూసుకుంటాడు. ఆంజనేయ భక్తులకు అపజయం అనేది లేదు.
శ్లో|| బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్యంచ హనుమ త్మ్సరణాద్భవేత్

ఏకాదశి కథ

ఏకాదశి కథ
విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో దాక్కున్నాడట. అప్పుడాయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట. తథాస్తు అన్నాడు నారాయణుడు. నాటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది.
ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
తాత్త్విక సందేశం:
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

పండగ ఆచరించు విధానం:
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.

2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

3. అసత్య మాడరాదు.

4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.

5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.

6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.

7 .మరునాడు అన్నదానం చేయాలి..

ఏకాదశి రోజును హరిదినం, వైకుంఠదినంగా కీర్తించాయి ధర్మసింధు వంటి గ్రంథాలు. 
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు.
సంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల మరియు కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలొనున్నవి.

మాసము మాస దేవడు శుద్ధ ఏకాదశి పర్వదినం బహుళ ఏకాదశి పర్వదినం

చైత్రము విష్ణువు కామదా వరూథినీ

వైశాఖము మధుసూదనుడు మోహినీ అపరా

జ్యేష్ఠము త్రివిక్రముడు నిర్జల యోగినీ

ఆషాఢము వామనుడు శయనీ, ప్రథమా కామికా

శ్రావణము శ్రీధరుడు పుత్రాద అజా

భాద్రపదము హృషీకేశుడు పరివర్తినీ ఇందిరా

ఆశ్వయుజము పద్మనాభుడు పాశాంకుశ రమా

కార్తీకము దామోదరుడు బొధినీ, ఉత్థాన ఉత్పత్తి

మార్గశిరము కేశవుడు ధృవ, మొక్షద సఫల

పుష్యము నారాయణుడు పుత్రాద, వైకుంఠఏకాదశి షట్తిలా

మాఘము మాధవుడు జయ, భీష్మఏకాదశి విజయ

ఫాల్గుణము గోవిందుడు ఆమలకీ పాపమొచనీ

అధికము (ఒకసారి,3 సంవత్సరములకు)
పురుషోత్తముడు పద్మినీ పరమా
మాసము/పక్షము/తిథి పర్వదినం

చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి పాపవిమోచననైకాదశి

మీ వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే


పెళ్లంటే నూరేళ్ల పంట అనేది పెద్దల మాట. అందుకే ఈ వేడుకలో వధూవరుల జాతకాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. జన్మరాశుల బట్టి వారి గుణగణాలు ఆధారపడి ఉంటాయనేది పెద్దల నమ్మకం. అందుకే జన్మ రాశులకు సరిపడే ఇతర రాశులకు చెందిన వారితోనే వివాహాలు జరపడానికి మొగ్గుచూపుతారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తారు. హిందూ జ్యోతిషం ప్రకారం అమ్మాయి లేదా అబ్బాయి జన్మరాశులకు సరిపోయేవారితో వివాహం జరిగితే అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. కాబట్టి వివాహ సమయంలో అనుకూలమైన జాతకులను ఎంపిక చేసుకుంటారు. 

మేష రాశి వారు ధైర్యంగా, స్వతంత్రంగా ఉంటారు. కాబట్టి వీరికి అనుకూలాంగా పనిచేయడానికి కొంత మంది ముందుకు రారు. వీరికి వృషభ రాశి వారితో వివాహం జరిగితే దాంపత్య జీవితంలో సుఖంగా ఉండరు. 

వృషభ రాశి వారు నిజాయితీపరులు, నమ్మకస్తులు, జీవితం గురించి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ జీవిస్తారు. ఈ రాశి వ్యక్తులు ధనురాశి వారిని వివాహం చేసుకోరాదు. ఎందుకంటే మీపట్ల వీరు కొంచెం అతిగా ప్రవర్తిస్తారు. అలాగే ధనస్సు రాశి అగ్నికి సంకేతం. మీతో మైండ్ గేమ్స్ ఆడతారు. అలాగే మీ ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వరు. 

మిథున రాశి లక్షణాల్లో ప్రధానమైంది నమ్మకం. వీళ్లు ఏదుటివారి నవ్విస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఎల్లప్పుడూ కొత్త దనాన్ని కోరుకుంటారు. వీరికి మకర రాశి సరైంది కాదు. ఎందుకంటే మీ ఆలోచనలకు ఈ రాశివారు వ్యతిరేకం. ఒక్కోసారి వీరి నిజాయితీ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మీ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తారు. 

కర్కాట రాశి వారిలో ఉద్వేగంతోపాటు, ఎదుటివారిపై బాధ్యతతోపాటు సహాయపడే స్వభావం ఉంటుంది. వీరికి కుంభ రాశివారితో మాత్రం వివాహం జరిగితే డబ్బు పొదుపు బాగానే ఉంటుంది కానీ మరీ అవసరమైతే తప్ప ఖర్చు చేయడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో మీకు సరి జోడిలా అనిపించిన మీకు అవసరమైనప్పుడు మాత్రం అండగా ఉండరు. 

సింహ రాశికి అందంగా ఉంటారు, అంతే కాకుండా తమ వ్యక్తితంపై వీరికి నమ్మకం ఎక్కువ. మానసికంగా బలంగా ఉన్నా కొంత మంది మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వ్యక్తులకు వృశ్చిక రాశి వారితో వివాహం జరిగితే మొండిగా వ్యవహరిస్తూ ఎదుటివారిపైనే ఎల్లప్పుడు తప్పుపడతారు. వీరికి అసూయ స్వభావం కూడా ఎక్కువే. 

కన్య రాశి వారిలో ఎదుటివారికి సహాయం చేసే గుణం ఎక్కువ, వీరిలో కొంచెం కళాత్మక విలువలు ఉంటాయి. ధనసు రాశివారిని పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ చికాకులే. భార్యాభర్తల సంబంధంలో ఎల్లప్పుడూ అనిశ్చితే కాకుండా ఓ అడుగు ఇంట్లో, ఓ అడుగు వీధిలో ఉంటుంది. తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటారు. మీ మనోభావాలను అసలు ఏ మాత్రం పట్టించుకోరు. 

తుల రాశివారు స్వేచ్ఛా జీవులు, అంతే కాకుండా స్నేహం గుణం కూడా ఎక్కువే. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్య రాశివారిని వివాహం చేసుకోరాదు. ఎందుకంటే అవసరమైన సందర్భాల్లో మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తారు. 

వృశ్చిక రాశిలో విశ్వసనీయత ఎక్కువ. సహచరులతో ఏ సందర్భంలోనైనా సౌకర్యవంతంగా ఉంటారు. వీరికి మేష రాశి వారితో పెళ్లి జరిగితే దాంపత్య జీవితం ఒడిదొడుకులతో సాగుతుంది. ఎప్పుడూ మీ నుంచి మాత్రమే కోరుకుంటారు కాని మీ కోసం పనిచేయడానికి ఇష్టపడరు. 

ధనూరాశి వారు ఉల్లాసప్రియులు, అలాగే ఎప్పుడూ ఎనర్జీగా ఉంటారు. అంతేకాకుండా ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటారు. వీరికి వృషభ రాశి వారితో వివాహం అంతగా కలిసి రాదు. 

మకర రాశి వారిలో నిజాయితీ, నమ్మకం, పేరు ప్రతిష్టలు ఎక్కువే. కలలను సాకారం చేసుకోడానికి సహకరించే వారికోసం అన్వేషిస్తారు. ఇలాంటి వారు మిథున రాశి జాతకులను వివాహం చేసుకుంటే సరైన అవగాహన ఉండదు. మిథున రాశి వారిని మార్చడం చాలా కష్టం. అందుకు వారికి అనుకూలంగా మీరు మారాల్సి ఉంటుంది. 

కుంభ రాశి వారు ఎక్కువ రక్షణ కోరుకుంటారు. కష్ట కాలంలో వీరికి సహాయం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కర్కాట రాశి వారిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. స్వంత్రంగా వ్యవహరించే కుంభ రాశి లక్షణం వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. 

మీన రాశివారు ఉద్వేగాలపై గౌరవం ఎక్కువ అంతే కాకుండా వీరు పుట్టుకతోనే రొమాంటిక్ ఫెలోస్. వీళ్లు కన్యా రాశి జాతకుల్ని మాత్రం పెళ్లి చేసుకుంటే కలల సాకారంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటారు.

నవగ్రహ దోషములు- పరిహారాలు

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబం ధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విము క్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివా రు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.

సూర్యుడు: ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటా డో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధు లు, తండ్రి తరుపు బంధు వులతో పడకపోవు ట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమ స్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పా రాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారప దార్థ ములు దానం చేయు ట. తండ్రి గారిని లేదా తండ్రితో సమా నమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

చంద్రుడు: చంద్రుడు జాతక చక్రంలో బల హీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభి వృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరో గ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మాన సిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపో వుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కు వగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అను గ్రహం కొరకు మాతృ సమానమైన స్ర్తీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పా లు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం, శివునికి ఆవుపాలతో అభిషే కం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట మొదలగు వాటి ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు.

కుజుడు: జాతకచక్రంలో కుజు డు బలహీనంగా ఉం డడం వల్ల ధైర్యం లేక పోవుట, అన్న దమ్ము లతో సఖ్యత నశించుట, భూమికి సంబంధిం చిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధిం పులు అప్పులు తీరకపోవుట, ఋణదా తల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారంనందు ఆసక్తి లేకపోవడం, కండరా ల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదు ర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలు గుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తిం చి కుజ గ్రహాను గ్రహం కొరకు సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనే య స్వామి వారిని పూజిం చాలి. అలాగే హను మాన్‌ చాలీసా పారాయ ణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్న దమ్ములకు సహాయం చేయడం, వారి మాట లకు విలువ ఇవ్వడం, స్ర్తీలు ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.

బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీ నంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి.. బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట, వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట, పెసలు దానం చేయుట, విద్యార్థు లకు పుస్తకాలను దానం చేయట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.

గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, ని యంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతా లు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరా యణ చేయడం, గురువుల ను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దా నం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

శుక్రుడు: జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగు ట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భ ర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనము ల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చే యుట, వివాహం కాని స్ర్తీలకు వారి వివా హం కొరకు సహకరించుట, స్ర్తీలను గౌరవిం చుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రా క్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.

శని: ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధ కము, అతినిద్ర దీర్థకాలిక వ్యాధులు, సరయి న ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, ఇతరుల ఆధీనములో పని చేయు ట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌర వం లేకపోవుట, పాడుపడిన గృహముల యందు జీవించుట, ఇతరుల ఇంట్లో జీవన ము సాగించుట, భార్య పిల్లలు అవమానిం చుట, కుటుం బమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరయిన భోజనం కూడా లేకపో వుట మొదల గు కష్టములు కలుగును. శని గ్రహ అనుగ్ర హమునకు శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట.

శనివారము నియమము గా ఉండుట, ఆంజనేయ స్వామి వారిని ఆరా ధించుట, హనుమాన్‌ చాలిసా పారాయణం చేయుట, హనుమాన్ కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది.స్వామి అయ్యప్ప మాల ధారణ చే యుట, శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట, దుప్పటి వస్తువులు దానం చేయుట, నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.

రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీ నముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కు ష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవిం చుట, విద్యార్థులు విద్య మధ్యలో మానివేయు ట, పాడుపడిన గృహములలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కు లు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవు ట, మొదలగున వి సంభ వించు చున్నప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి దోష నివార ణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట, దే వి భాగవతం పారాయణం చేయుట, గోమేధి కం గాని  ఎనిమిది  ముఖములు గల రుద్రాక్ష ను గాని ధరించ వలెను. భవాని మాల ధరిం చుట, స్ర్తీలను గౌరవించుట వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును.దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది.

కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తన లో తానే ఊహించుకొనుట, తనని తాను దేవు డు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధార ణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పో వుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచి త్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నా డు. కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయు ట. దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట. అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట. వైఢూర్య ము గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు.

ప్రతిరోజు సూర్య నమస్కారం చేసు కొని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్నను పరిహారం జరుగును.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles