Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Tuesday 17 January 2017

మీ వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే


పెళ్లంటే నూరేళ్ల పంట అనేది పెద్దల మాట. అందుకే ఈ వేడుకలో వధూవరుల జాతకాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. జన్మరాశుల బట్టి వారి గుణగణాలు ఆధారపడి ఉంటాయనేది పెద్దల నమ్మకం. అందుకే జన్మ రాశులకు సరిపడే ఇతర రాశులకు చెందిన వారితోనే వివాహాలు జరపడానికి మొగ్గుచూపుతారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తారు. హిందూ జ్యోతిషం ప్రకారం అమ్మాయి లేదా అబ్బాయి జన్మరాశులకు సరిపోయేవారితో వివాహం జరిగితే అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. కాబట్టి వివాహ సమయంలో అనుకూలమైన జాతకులను ఎంపిక చేసుకుంటారు. 

మేష రాశి వారు ధైర్యంగా, స్వతంత్రంగా ఉంటారు. కాబట్టి వీరికి అనుకూలాంగా పనిచేయడానికి కొంత మంది ముందుకు రారు. వీరికి వృషభ రాశి వారితో వివాహం జరిగితే దాంపత్య జీవితంలో సుఖంగా ఉండరు. 

వృషభ రాశి వారు నిజాయితీపరులు, నమ్మకస్తులు, జీవితం గురించి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ జీవిస్తారు. ఈ రాశి వ్యక్తులు ధనురాశి వారిని వివాహం చేసుకోరాదు. ఎందుకంటే మీపట్ల వీరు కొంచెం అతిగా ప్రవర్తిస్తారు. అలాగే ధనస్సు రాశి అగ్నికి సంకేతం. మీతో మైండ్ గేమ్స్ ఆడతారు. అలాగే మీ ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వరు. 

మిథున రాశి లక్షణాల్లో ప్రధానమైంది నమ్మకం. వీళ్లు ఏదుటివారి నవ్విస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఎల్లప్పుడూ కొత్త దనాన్ని కోరుకుంటారు. వీరికి మకర రాశి సరైంది కాదు. ఎందుకంటే మీ ఆలోచనలకు ఈ రాశివారు వ్యతిరేకం. ఒక్కోసారి వీరి నిజాయితీ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మీ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తారు. 

కర్కాట రాశి వారిలో ఉద్వేగంతోపాటు, ఎదుటివారిపై బాధ్యతతోపాటు సహాయపడే స్వభావం ఉంటుంది. వీరికి కుంభ రాశివారితో మాత్రం వివాహం జరిగితే డబ్బు పొదుపు బాగానే ఉంటుంది కానీ మరీ అవసరమైతే తప్ప ఖర్చు చేయడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో మీకు సరి జోడిలా అనిపించిన మీకు అవసరమైనప్పుడు మాత్రం అండగా ఉండరు. 

సింహ రాశికి అందంగా ఉంటారు, అంతే కాకుండా తమ వ్యక్తితంపై వీరికి నమ్మకం ఎక్కువ. మానసికంగా బలంగా ఉన్నా కొంత మంది మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వ్యక్తులకు వృశ్చిక రాశి వారితో వివాహం జరిగితే మొండిగా వ్యవహరిస్తూ ఎదుటివారిపైనే ఎల్లప్పుడు తప్పుపడతారు. వీరికి అసూయ స్వభావం కూడా ఎక్కువే. 

కన్య రాశి వారిలో ఎదుటివారికి సహాయం చేసే గుణం ఎక్కువ, వీరిలో కొంచెం కళాత్మక విలువలు ఉంటాయి. ధనసు రాశివారిని పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ చికాకులే. భార్యాభర్తల సంబంధంలో ఎల్లప్పుడూ అనిశ్చితే కాకుండా ఓ అడుగు ఇంట్లో, ఓ అడుగు వీధిలో ఉంటుంది. తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటారు. మీ మనోభావాలను అసలు ఏ మాత్రం పట్టించుకోరు. 

తుల రాశివారు స్వేచ్ఛా జీవులు, అంతే కాకుండా స్నేహం గుణం కూడా ఎక్కువే. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్య రాశివారిని వివాహం చేసుకోరాదు. ఎందుకంటే అవసరమైన సందర్భాల్లో మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తారు. 

వృశ్చిక రాశిలో విశ్వసనీయత ఎక్కువ. సహచరులతో ఏ సందర్భంలోనైనా సౌకర్యవంతంగా ఉంటారు. వీరికి మేష రాశి వారితో పెళ్లి జరిగితే దాంపత్య జీవితం ఒడిదొడుకులతో సాగుతుంది. ఎప్పుడూ మీ నుంచి మాత్రమే కోరుకుంటారు కాని మీ కోసం పనిచేయడానికి ఇష్టపడరు. 

ధనూరాశి వారు ఉల్లాసప్రియులు, అలాగే ఎప్పుడూ ఎనర్జీగా ఉంటారు. అంతేకాకుండా ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటారు. వీరికి వృషభ రాశి వారితో వివాహం అంతగా కలిసి రాదు. 

మకర రాశి వారిలో నిజాయితీ, నమ్మకం, పేరు ప్రతిష్టలు ఎక్కువే. కలలను సాకారం చేసుకోడానికి సహకరించే వారికోసం అన్వేషిస్తారు. ఇలాంటి వారు మిథున రాశి జాతకులను వివాహం చేసుకుంటే సరైన అవగాహన ఉండదు. మిథున రాశి వారిని మార్చడం చాలా కష్టం. అందుకు వారికి అనుకూలంగా మీరు మారాల్సి ఉంటుంది. 

కుంభ రాశి వారు ఎక్కువ రక్షణ కోరుకుంటారు. కష్ట కాలంలో వీరికి సహాయం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కర్కాట రాశి వారిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. స్వంత్రంగా వ్యవహరించే కుంభ రాశి లక్షణం వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. 

మీన రాశివారు ఉద్వేగాలపై గౌరవం ఎక్కువ అంతే కాకుండా వీరు పుట్టుకతోనే రొమాంటిక్ ఫెలోస్. వీళ్లు కన్యా రాశి జాతకుల్ని మాత్రం పెళ్లి చేసుకుంటే కలల సాకారంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటారు.

నవగ్రహ దోషములు- పరిహారాలు

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబం ధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విము క్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివా రు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.

సూర్యుడు: ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటా డో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధు లు, తండ్రి తరుపు బంధు వులతో పడకపోవు ట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమ స్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పా రాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారప దార్థ ములు దానం చేయు ట. తండ్రి గారిని లేదా తండ్రితో సమా నమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

చంద్రుడు: చంద్రుడు జాతక చక్రంలో బల హీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభి వృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరో గ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మాన సిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపో వుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కు వగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అను గ్రహం కొరకు మాతృ సమానమైన స్ర్తీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పా లు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం, శివునికి ఆవుపాలతో అభిషే కం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట మొదలగు వాటి ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు.

కుజుడు: జాతకచక్రంలో కుజు డు బలహీనంగా ఉం డడం వల్ల ధైర్యం లేక పోవుట, అన్న దమ్ము లతో సఖ్యత నశించుట, భూమికి సంబంధిం చిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధిం పులు అప్పులు తీరకపోవుట, ఋణదా తల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారంనందు ఆసక్తి లేకపోవడం, కండరా ల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదు ర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలు గుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తిం చి కుజ గ్రహాను గ్రహం కొరకు సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనే య స్వామి వారిని పూజిం చాలి. అలాగే హను మాన్‌ చాలీసా పారాయ ణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్న దమ్ములకు సహాయం చేయడం, వారి మాట లకు విలువ ఇవ్వడం, స్ర్తీలు ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.

బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీ నంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి.. బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట, వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట, పెసలు దానం చేయుట, విద్యార్థు లకు పుస్తకాలను దానం చేయట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.

గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, ని యంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతా లు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరా యణ చేయడం, గురువుల ను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దా నం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

శుక్రుడు: జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగు ట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భ ర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనము ల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చే యుట, వివాహం కాని స్ర్తీలకు వారి వివా హం కొరకు సహకరించుట, స్ర్తీలను గౌరవిం చుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రా క్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.

శని: ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధ కము, అతినిద్ర దీర్థకాలిక వ్యాధులు, సరయి న ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, ఇతరుల ఆధీనములో పని చేయు ట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌర వం లేకపోవుట, పాడుపడిన గృహముల యందు జీవించుట, ఇతరుల ఇంట్లో జీవన ము సాగించుట, భార్య పిల్లలు అవమానిం చుట, కుటుం బమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరయిన భోజనం కూడా లేకపో వుట మొదల గు కష్టములు కలుగును. శని గ్రహ అనుగ్ర హమునకు శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట.

శనివారము నియమము గా ఉండుట, ఆంజనేయ స్వామి వారిని ఆరా ధించుట, హనుమాన్‌ చాలిసా పారాయణం చేయుట, హనుమాన్ కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది.స్వామి అయ్యప్ప మాల ధారణ చే యుట, శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట, దుప్పటి వస్తువులు దానం చేయుట, నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.

రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీ నముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కు ష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవిం చుట, విద్యార్థులు విద్య మధ్యలో మానివేయు ట, పాడుపడిన గృహములలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కు లు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవు ట, మొదలగున వి సంభ వించు చున్నప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి దోష నివార ణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట, దే వి భాగవతం పారాయణం చేయుట, గోమేధి కం గాని  ఎనిమిది  ముఖములు గల రుద్రాక్ష ను గాని ధరించ వలెను. భవాని మాల ధరిం చుట, స్ర్తీలను గౌరవించుట వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును.దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది.

కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తన లో తానే ఊహించుకొనుట, తనని తాను దేవు డు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధార ణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పో వుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచి త్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నా డు. కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయు ట. దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట. అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట. వైఢూర్య ము గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు.

ప్రతిరోజు సూర్య నమస్కారం చేసు కొని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్నను పరిహారం జరుగును.

శ్రీరంగం

అధ్భుతమైన వైష్ణవ దివ్యక్షేత్రం.
ఒక్క సారైనాఈజన్మలోనే దర్సించవలసిన కలియుగ వైకుంఠం.
శ్రీమహావిష్ణువు స్వయంవ్యక్తమైన ఎనిమిది క్షేత్రాల్లో శ్రీరంగం మొట్టమొదటిది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో (దివ్యదేశాలు) అన్నిటికంటే మొట్టమొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది పరిగణన పొందుతోంది. తిరువరంగ తిరుపతి, పెరియకోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. వైష్ణవ పరిభాషలో ‘కోయిల్’ లేదా కోవెల అనే పదం సూచించేది ఈ ఆలయాన్ని మాత్రమే. ఈ ఆలయం బృహత్పరిమాణంలో ఉంటుంది. ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి ఏడు ప్రాకారాలు లేదా ప్రహరీలు ఉన్నాయి. ఈ ప్రహరీలు దృఢమైన, భారీ బురుజులున్న గోడలతో ఏర్పాటయ్యాయి, అవి గర్భగుడి చుట్టూ ఆవరించి ఉన్నాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులకెవరికైనా ఓ విశిష్టమైన దృష్టిని అందిస్తాయి. జంటనదులైన కావేరి, కోలెరూన్ లేదా కొల్లిదంల ద్వారా రూపుదిద్దుకున్న ఓ చిన్న ద్వీపంలో ఈ ఆలయం నెలకొని ఉంది.

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం ఓ గొప్ప సామ్రాజ్యానికి చెందిన చారిత్రక గత వైభవాన్నీ, వేలాది సంవత్సరాలనాటి ఓ నాగరికతనూ చాటి చెబుతుంది. పల్లవరాజుల పాలన మతపరమైన ఓ గట్టి పునాది ఏర్పరడానికి ప్రతీకగా నిలుస్తోంది, ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి కర్ణాట ప్రాంతంలో ఆర్య సంస్థల వృద్ధికి ఈ సామ్రాజ్యం గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్టు కనిపిస్తుంది. కోరమండల్ తీరాన్నీ, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్నీ మూడు వందల ఏళ్ళకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్థిల్లేందుకు దోహదపడ్డారు.

చోళులు 13వ శతాబ్దంలో మధురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకు చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ, అవి శాసనాలూ, భవనాల వరకూ మాత్రమే పరిమితమైపోయాయి. హోయసలులను 14వ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు. ఆ తర్వాత, దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ, 1336లో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని 1565 వరకూ కొనసాగించుకోగలిగింది.

అదే సమయంలో యూరోపియన్లు దక్షిణ భారతదేశంలో కాలుపెట్టారు. పదహారో శతాబ్దంలో అనేకమంది విదేశీ పర్యాటకులూ, వ్యాపారులూ ఈ మార్గాల్లోంచీ ప్రయాణాలు సాగించారు, కానీ విజయనగర సామ్రాజ్యం తమ వ్యాపారాలకోసం సమకూర్చిన మార్గాలమీద తప్పితే పోషక భూభాగాలమీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో, 1600లో ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ, 1664లో ఫ్రెంచి కంపెనీలు వెలిశాయి.

1680లో, ఔరంగజేబు రాజు (1658-1707) పశ్చిమ దక్కన్ ప్రాంతంలో దండయాత్రకు దిగేడు. సుదీర్ఘమైన ఆక్రమణలూ, భారీ ప్రాణనష్టం తరువాత, బీజాపూర్, గోల్కొండ కోటలు అతని ఆధీనంలోకి వచ్చాయి, అతని మరణం వరకూ ఈ దండయాత్రలు కొనసాగుతూనేవున్నాయి.

అయితే, యూరప్‌లో, ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం ఆంగ్లేయులూ, ఫ్రెంచివారి మధ్య పరస్పర పోరాటానికి దారి తీసింది. మద్రాస్‌ను డూప్లెక్స్ (1746లో) ఆక్రమించాడు, రెండేళ్ళ తదర్వాత దాన్ని తిరిగి ఆంగ్లేయులకు ఇచ్చేశారు. 1752లో ఫ్రెంచివారు బలవంతంగా లొంగిపోవాల్సి వచ్చింది, 1754లో డూప్లెక్స్ తో సంబంధం లేదని వదిలించుకున్నారు, అతన్ని వెనక్కి పిలిపించారు.

1760లో, లల్లీ-టోలెండల్ నాయకత్వంలో ఫ్రెంచివారు చేసిన మరో ప్రయత్నం విఫలమయింది, 1763లో ఫ్రెంచివారి వాణిజ్య స్థావరాన్ని కూల్చేశారు. అప్పటినుంచీ, ఇంగ్లీష్ కంపెనీ క్రమంగా మొత్తం భారత భూభాగమంతటినీ స్వాధీనం చేసుకుంది. ఫ్రెంచివారు విజయానికి చేరువగా వచ్చినప్పటికీ, ఆ తర్వాత వెల్లస్లీ నాయకత్వంలోని ఆంగ్లేయుల చేతిలో 1798లో వారు ఓడిపోయారు. మైసూరును ముట్టడించిన వెల్లస్లీ 1799లో శ్రీరంగపట్నాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత మొత్తం దక్షిణ భారతదేశమంతా ఇంగ్లండ్ ఆధిపత్యం కిందికి వచ్చింది. కర్నాటక ప్రాంతం కూడా అది మిగిలిఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ ప్రత్యక్ష పరిపాలన కిందికి చేరింది.

నిర్మాణం

శ్రీరంగం ఆలయం భారతదేశపు దక్షిణపు కొనలో కావేరీ నది రెండు బాహువుల మధ్యా ఏర్పడిన ఓ ద్వీపం మీద 10 డిగ్రీల 52’ఎన్, 78 డిగ్రీల 42’ఇ వద్ద నెలకొని ఉంది. ఆ ఆలయం సుమారు 6,31,000 చదరపు మీటర్ల (156 ఎకరాల) విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ఆలయానికి గర్భగుడి చుట్టూ ఏడు ఏకకేంద్రక దీర్ఘచతురస్రాకార ప్రాకారాలు ఉన్నాయి. ఏడు ప్రాకారాలున్న దేవాలయం భారతదేశంలో శ్రీరంగం ఒక్కటే, ఇది పవిత్రమైన సంకేతాన్ని స్ఫురింపజేసే సంఖ్య, ఇవి ఏడు యోగ కేంద్రాలనీ లేదా మధ్యభాగంలో ఆత్మ నిలిచి ఉండే మానవ శరీరాన్ని రూపొందించే ఏడు మూలకాలను సూచిస్తుందనీ ఈనాటి వైష్ణవం విశ్వసిస్తోంది.

ఏడవ ప్రాకారం గోపురాలు అసంపూర్తిగా మిగిలిపోయేయి. వాటిని రాజగోపురం అంటారు. అవి పూర్తయినట్టయితే, వాటి ఎత్తు కనీసం 50 మీటర్లు ఉండవచ్చునని వాటి భారీ పునాదుల కొలతలు రుజువు చేస్తున్నాయి.
ఆరవ ప్రాకారం

ఆరవ ప్రాకారానికి నాలుగు గోపురాలున్నాయి; తూర్పు గోపురం పదమూడవ శతాబ్దం నాటి ఆనవాళ్ళతో కూడిన శాసనాల పరిమాణం రీత్యా అన్ని విధాలా అత్యంత ఘనమైనది, ఊరేగింపు వాహనాల్ని ఈ ప్రహరీలో ఉంచుతారు.
అయిదవ ప్రాకారం

అయిదవ ప్రాకారాన్ని చోళుల శైలిలో నిర్మించిన మనవాళ్ళ మమునిగళ్ ఆలయం ఉంది.
నాలుగవ ప్రాకారం

నాలుగవ ప్రాకారంలోని దక్షిణ భాగంలో ఉన్న వేణుగోపాల కృష్ణన్ ఆలయంలో హిందూయేతరులుకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు, జితెర్ (వీణ) వాయిస్తున్న లేదా చిలుకలతో ఉన్న లేదా అద్దాల్లో చూసుకుంటూ తమ ముస్తాబులకు తుదిమెరుగులు (తిలకాలు) దిద్దుకుంటున్న యువతుల అత్యంత సుందరమైన శిల్పాలతో అలంకరించి ఉన్న ఈ ప్రహరీ బయటి గోడలు చూపరులకు అద్భుతమైన ఆహ్లాదం ఇస్తాయి. ఈ ఆలయానికి వేలాడుతున్నట్టుగా వుండే పైకప్పు మీదికి ఎక్కి పరికిస్తే శ్రీరంగం ఆలయాన్ని మొత్తం స్థాయిలో వీక్షించవచ్చు. ఈ ప్రహరీలో అత్యంత ఆసక్తికరమైన వస్తువులతో ఓ ప్రదర్శనశాల కూడా ఉంది. ఈ ప్రహరీలోని తూర్పు ఆవరణలోకి హిందూయేతరుల్ని కూడా అనుమతిస్తారు, అది వెల్లై గోపురం అంటే శ్వేత గోపురంతో వ్యాపించి ఉంది. దక్షిణాన ప్రసిద్ధమైన శేషరాయర్ మండపం ఉంది. ఆ మండపానికి ఎదురుగా వెయ్యి స్తంభాల మందిరాన్ని చూడవచ్చు, దీనిలోనే దేవ, దేవతా విగ్రహాలున్నాయి. డిసెంబర్, జనవరి నెలలో జరిగే ఏకాదశి మహోత్సవాల సమయంలో ఆళ్వారుల్నీ, ఆచార్యులనీ బయటికి తీసుకొస్తారు.

మూడవ ప్రాకారం

మూడో ప్రాకారంలో కార్తీక గోపురం ఉంది, అది గరుడ మండపానికి దారితీస్తుంది, 14 వరుసలతో ఉన్న ఈ మండపం ఆలయంలోనే అత్యంత అందమైనది. పశ్చిమ భాగంలో వంటసాలలు, బియ్యం నిల్వచేసే గదులు ఉన్నాయి. ఈ విభాగం తూర్పు భాగంలో పవిత్రమైన కొలను (చంద్రపుష్కరిణి) ఉంది. ఇది తూర్పు, పశ్చిమాల్లో వృత్తాకారపు మెట్ల వరుసలతో అలరారుతోంది. తూర్పు విభాగంలో అనేక ప్రత్యేక పూజామందిరాలు, మండపాలు ఉన్నాయి.
రెండవ ప్రాకారం

రెండో ప్రహరీని చేరుకోవడానికి తప్పనిసరిగా దక్షిణ ఆర్యభట్టల్ మీదుగా వెళ్ళాలి. మిగినవాటితో పోలిస్తే చాలా ఇరుగ్గా ఉండే ఈ మొత్తం రెండో ప్రహరీలో, పూర్తి వెలుతురు ఉన్నప్పుడే సందర్శకులు వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది దాదాపుగా కూలిపోయిన మండపాల శ్రేణితో ఉంటుంది. ఈశాన్య మూలలో దేవుడి వంటశాల ప్రాంగణం ఉంటుంది; అక్కడ పాలనూ, భక్తులకు పంపిణీ చేసే అన్న ప్రసాదాలనూ ఉంచుతారు.
మొదటి ప్రాకారం

సందర్శకులు మొదటి ప్రాకారానికి చేరుకుంటారు, ఇది కూడా రెండోదానిలాగే ఉంటుంది, ఇక్కడ దీని దక్షిణ భాగానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది; నచికేతన్ గోపురం, చెరోవైపునా శంఖనిధి, పద్మనిధి అని పిలిచే బొమ్మలూ, శంఖం, పద్మం ఉంటాయి, ఇవన్నీ విష్ణుమూర్తి చిహ్నాలు. ఇవి నైరుతిలో నిల్వచేసే గదులకు అమర్చి ఉంటాయి. గర్భగుడి నుంచి బయటికి తీసుకువస్తున్నప్పుడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిఫలింపజేయడానికి మూలల్లో భారీ అద్దాలు బిగించి ఉంటాయి. వాయవ్య మూలలో వ్యక్తుల చిత్రపటాలతో అలంకరించిన పైకప్పుతో యాగశాల, తొండమాన్ మండపం ఉంటాయి. తూర్పు భాగంలో రెండు మండపాలు- అర్జున మండపం, కిళి మండపం ఉన్నాయి.

గోపురం,
నిర్మాణం

శ్రీరంగం ఆలయం భారతదేశపు దక్షిణపు కొనలో కావేరీ నది రెండు బాహువుల మధ్యా ఏర్పడిన ఓ ద్వీపం మీద 10 డిగ్రీల 52’ఎన్, 78 డిగ్రీల 42’ఇ వద్ద నెలకొని ఉంది. ఆ ఆలయం సుమారు 6,31,000 చదరపు మీటర్ల (156 ఎకరాల) విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ఆలయానికి గర్భగుడి చుట్టూ ఏడు ఏకకేంద్రక దీర్ఘచతురస్రాకార ప్రాకారాలు ఉన్నాయి. ఏడు ప్రాకారాలున్న దేవాలయం భారతదేశంలో శ్రీరంగం ఒక్కటే, ఇది పవిత్రమైన సంకేతాన్ని స్ఫురింపజేసే సంఖ్య, ఇవి ఏడు యోగ కేంద్రాలనీ లేదా మధ్యభాగంలో ఆత్మ నిలిచి ఉండే మానవ శరీరాన్ని రూపొందించే ఏడు మూలకాలను సూచిస్తుందనీ ఈనాటి విష్ణవం విశ్వసిస్తోంది.
ఏడవ ప్రాకారం

ఏడవ ప్రాకారం గోపురాలు అసంపూర్తిగా మిగిలిపోయేయి. వాటిని రాజగోపురం అంటారు. అవి పూర్తయినట్టయితే, వాటి ఎత్తు కనీసం 50 మీటర్లు ఉండవచ్చునని వాటి భారీ పునాదుల కొలతలు రుజువు చేస్తున్నాయి..
ఆరవ ప్రాకారం

ఆరవ ప్రాకారానికి నాలుగు గోపురాలున్నాయి; తూర్పు గోపురం పదమూడవ శతాబ్దం నాటి ఆనవాళ్ళతో కూడిన శాసనాల పరిమాణం రీత్యా అన్ని విధాలా అత్యంత ఘనమైనది, ఊరేగింపు వాహనాల్ని ఈ ప్రహరీలో ఉంచుతారు.
అయిదవ ప్రాకారం

అయిదవ ప్రాకారాన్ని చోళుల శైలిలో నిర్మించిన మనవాళ్ళ మమునిగళ్ ఆలయం ఉంది.
నాలుగవ ప్రాకారం

నాలుగవ ప్రాకారంలోని దక్షిణ భాగంలో ఉన్న వేణుగోపాల కృష్ణన్ ఆలయంలో హిందూయేతరులుకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు, జితెర్ (వీణ) వాయిస్తున్న లేదా చిలుకలతో ఉన్న లేదా అద్దాల్లో చూసుకుంటూ తమ ముస్తాబులకు తుదిమెరుగులు (తిలకాలు) దిద్దుకుంటున్న యువతుల అత్యంత సుందరమైన శిల్పాలతో అలంకరించి ఉన్న ఈ ప్రహరీ బయటి గోడలు చూపరులకు అద్భుతమైన ఆహ్లాదం ఇస్తాయి. ఈ ఆలయానికి వేలాడుతున్నట్టుగా వుండే పైకప్పు మీదికి ఎక్కి పరికిస్తే శ్రీరంగం ఆలయాన్ని మొత్తం స్థాయిలో వీక్షించవచ్చు. ఈ ప్రహరీలో అత్యంత ఆసక్తికరమైన వస్తువులతో ఓ ప్రదర్శనశాల కూడా ఉంది. ఈ ప్రహరీలోని తూర్పు ఆవరణలోకి హిందూయేతరుల్ని కూడా అనుమతిస్తారు, అది వెల్లై గోపురం అంటే శ్వేత గోపురంతో వ్యాపించి ఉంది. దక్షిణాన ప్రసిద్ధమైన శేషరాయర్ మండపం ఉంది. ఆ మండపానికి ఎదురుగా వెయ్యి స్తంభాల మందిరాన్ని చూడవచ్చు, దీనిలోనే దేవ, దేవతా విగ్రహాలున్నాయి. డిసెంబర్, జనవరి నెలలో జరిగే ఏకాదశి మహోత్సవాల సమయంలో ఆళ్వారుల్నీ, ఆచార్యులనీ బయటికి తీసుకొస్తారు.
మూడవ ప్రాకారం

మూడో ప్రాకారంలో కార్తీక గోపురం ఉంది, అది గరుడ మండపానికి దారితీస్తుంది, 14 వరుసలతో ఉన్న ఈ మండపం ఆలయంలోనే అత్యంత అందమైనది. పశ్చిమ భాగంలో వంటసాలలు, బియ్యం నిల్వచేసే గదులు ఉన్నాయి. ఈ విభాగం తూర్పు భాగంలో పవిత్రమైన కొలను (చంద్రపుష్కరిణి) ఉంది. ఇది తూర్పు, పశ్చిమాల్లో వృత్తాకారపు మెట్ల వరుసలతో అలరారుతోంది. తూర్పు విభాగంలో అనేక ప్రత్యేక పూజామందిరాలు, మండపాలు ఉన్నాయి.
రెండవ ప్రాకారం

రెండో ప్రహరీని చేరుకోవడానికి తప్పనిసరిగా దక్షిణ ఆర్యభట్టల్ మీదుగా వెళ్ళాలి. మిగినవాటితో పోలిస్తే చాలా ఇరుగ్గా ఉండే ఈ మొత్తం రెండో ప్రహరీలో, పూర్తి వెలుతురు ఉన్నప్పుడే సందర్శకులు వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది దాదాపుగా కూలిపోయిన మండపాల శ్రేణితో ఉంటుంది. ఈశాన్య మూలలో దేవుడి వంటశాల ప్రాంగణం ఉంటుంది; అక్కడ పాలనూ, భక్తులకు పంపిణీ చేసే అన్న ప్రసాదాలనూ ఉంచుతారు.
మొదటి ప్రాకారం

సందర్శకులు మొదటి ప్రాకారానికి చేరుకుంటారు, ఇది కూడా రెండోదానిలాగే ఉంటుంది, ఇక్కడ దీని దక్షిణ భాగానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది; నచికేతన్ గోపురం, చెరోవైపునా శంఖనిధి, పద్మనిధి అని పిలిచే బొమ్మలూ, శంఖం, పద్మం ఉంటాయి, ఇవన్నీ విష్ణుమూర్తి చిహ్నాలు. ఇవి నైరుతిలో నిల్వచేసే గదులకు అమర్చి ఉంటాయి. గర్భగుడి నుంచి బయటికి తీసుకువస్తున్నప్పుడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిఫలింపజేయడానికి మూలల్లో భారీ అద్దాలు బిగించి ఉంటాయి. వాయవ్య మూలలో వ్యక్తుల చిత్రపటాలతో అలంకరించిన పైకప్పుతో యాగశాల, తొండమాన్ మండపం ఉంటాయి. తూర్పు భాగంలో రెండు మండపాలు- అర్జున మండపం, కిళి మండపం ఉన్నాయి.

దేవతామూర్తులు
శ్రీరంగం ఆలయంలో సన్నిధులు

అధిదేవుడైన రంగనాథ స్వామి సన్నిధితో పాటుగా, ఆలయ సమూదాయంలో అనేక ఇతర సన్నిధులూ, 53 ఉప-సన్నిధులూ కూడా ఉన్నాయి.

ఆలయంలో ఉన్న ఇతర సన్నిధులు:

తాయారు సన్నిధి§
చక్రధ్వజ్వర్ సన్నిది
ఉడయవర్ (రామానుజార్ సన్నిధి)
గరుడాళ్వార్ సన్నిధి
ధన్వంతరి సన్నిధి
హయగ్రీవార్ సన్నిధి
తమిళనాడులోని తిరుచినాపల్లి (తిరుచ్చి) ( Trichy - Tiruchirappalli )కి10 కిమీ దూరం లో ఉంది . తిరుచినాపల్లి ఎక్కడుంది అనేగా చెన్నై నుంచి 330 కిమీ దూరం . శ్రీరంగం లో రైల్వేస్టేషన్ ఉంది . IRCTC కోడ్ SRGM .
తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగంకు ప్రతీ పదినిమిషాలకు ఒక బస్సు వెళుతుంది. దూరం 9 కి.మీ. 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.
తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీరంగంకు 15 కి.మీదూరం ఉంటుంది. శ్రీరంగంలోనూ రైల్వేస్టేషన్‌ ఉంది. స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలో ఆలయం ఉంటుంది.
రైలులో వెళ్లాలనుకుంటే హైదరాబాద్‌ నుంచి ముందుగా చెన్నై చేరుకోవాలి. అక్కడి నుంచి తిరుచిరాపల్లి వరకు మరో రైలులో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులో, క్యాబ్‌లో శ్రీరంగం చేరుకోవచ్చు.
విశాఖపట్టణం నుంచి విజయవాడ మీదుగా చెన్నై చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి చేరుకోవచ్చు.
హైదరాబాద్‌ నుంచి చెన్నై దూరం 770 కి.మీ. స్లీపర్‌క్లాస్‌ చార్జీ రూ.395. ప్రయాణ సమయం 15 గంటలు.
విశాఖపట్టణం నుంచి చెన్నై దూరం 781కి.మీ స్లీపర్‌క్లా్‌సచార్జీ రూ. 425.ప్రయాణ సమయం 15 గంటలు.
చెన్నై నుంచి తిరుచిరాపల్లి దూరం 350 కి.మీ స్లీపర్‌క్లాస్‌ చార్జీ రూ.215.ప్రయాణ సమయం 5.30 గంటలు.
హైదరాబాద్‌ నుంచి చెన్నై మీదుగా తిరుచిరాపల్లికి విమానసర్వీసులున్నాయి. ప్రయాణ సమయం 3 గంటల 40నిమిషాలు. చెన్నైలో ఆగుతుంది కాబట్టి సమయంలో మార్పులుంటాయి. ప్రయాణ
చార్జీలురూ.9300 లనుంచి మొదలవుతాయి.
విశాఖపట్టణం నుంచి వెళ్లాలనుకుంటే రూ. 13000ల నుంచి చార్జీలు మొదలవుతాయి.
దర్శనవేళలు
సాధారణ దర్శనం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.15 వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 6.45 వరకు పూజ జరుగుతుంది.ఈసమయంలో దర్శనానికి అనుమతించరు. ఉదయం 6గంటల నుంచి 7.15 వరకు విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవలో పాల్గొనాలనుకుంటే రూ.50టిక్కెట్‌కొనుగోలు చేయాలి. శీఘ్రదర్శనం కావాలనుకుంటే 250 టిక్కెట్‌ కొనుగోలు చేయాలి.

వసతి
వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు. దేవాలయ వసతి గృహాలున్నాయి. ప్రైవేటు హోటల్స్‌, లాడ్జీలు ఉన్నాయి. దేవాలయం ప్రధాన ప్రవేశ ద్వారంకు సమీపంలోనే హోటల్స్‌ ఉన్నాయి. వసతి, భోజనంకు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. కావాలనుకుంటే దర్శనం చేసుకుని తిరిగి తిరుచిరాపల్లి వెళ్లి స్టే చేయవచ్చు. అక్కడ ఐదు నక్షత్రాల హోటల్స్‌ నుంచి సాధారణ లాడ్జీల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles