శ్రీలక్ష్మీహయగ్రీవ అవతార వైభవం
శ్రీ మాన్ ప్రియ భగవత్భందువులారా!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి,స్థితి,లయ కారకుండు ఆశ్రితవత్సలుడు అయిన శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట పరిపాలనార్ధమై ఆది కల్పమున మధు,కైటభులను రాక్షసులు ధర్మహాని,వేదాపహరణ చేయగా ,వేదమును,వేదం ధర్మమును కాపాడుటకు బ్రహ్మచే రాక్షసులు పొందిన వరమును బేధము లేకుండా ద్విరూపధారియై అనగా అశ్వముఖము,మానవ దేహము ధరించి హయగ్రీవ అవతారముగా ఆవిర్భవించి,రాక్షస సంహారం గావించి వారి మేధస్సు ద్వారా మేధినిని(భూమిని)ఏర్పరచి ఈ భూమి నిర్మాణకర్త అయినారు.బ్రహ్మవిధి నిర్వాహణ లోపమువలన,సృష్టికి అంతరాయము కలిగినందున సరస్వతీ దేవికి అక్షరాభ్యాసము చేయించి ఆది గురువుగా జగత్ప్రసిద్ధి చెందినారు.మరియు మహలక్ష్మికి ధనాదిపత్యమును,ఇంద్రాది దేవతలకు,నవగ్రహములకు పదవులు అనుగ్రహించినారు. చతుర్ముఖ బ్రహ్మకు వేదాలను,యాజ్ఞవల్క్య మహర్షికి శుక్ల యజుర్వేదాన్ని ఉపదేశించినవారు హయగ్రీవుడే.
ఇటువంటి ప్రత్యేకలుకల్గిన స్వామి తిరునక్షత్రమ్ (జయంతి) శ్రావణ శుద్ధ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) కావున ఈ దినమున స్వామివారిని విశేషముగా ఆరాదించిన వారికి సమస్త విద్యలు వశం అవుతాయి అని వేద వాక్కు.
--------------------------------------------------------------