Tuesday 1 December 2015

సప్తచిరంజీవులు..

1. అశ్వత్థామ :- ద్రోణాచార్యుని కుమారుడు.
మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు..

2. బలిచక్రవర్తి :- ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు.ఇంద్రుని జయించినవాడు.
వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు త్రోక్కబడ్డాడు. కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గదాదారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు..

3.వ్వాసమహర్షి :-సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు.
అస్తాదాస పురాణాలను,
బ్రహ్మసూత్రములను ,
భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు.
వేదాలను విడబరచిన వారు అని వ్యాసుడుని పేర్కొంటారు..

4.హనుమంతుడు :-కేసరి భార్య అయిన అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు.
సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు.
పరమేశ్వరుని అవతారము.
రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ.
మహా భారతయుద్ధంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయానికు కూడా దోహదకారి అయ్యాడు.

5.విభీషణుడు :- కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు. బ్రహ్మపరమున ఇతడు సుశీలుడైయ్యాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి, సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు శ్రీ రామునికి ఉపాయము చెప్పాడు.రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు..

6.కృపాచార్యుడు:- సప్త చిరంజీవులలో 6వ వాడు . కృపుడు శరద్వంతుని కుమారుడు..
శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు.
ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై  ఒక అప్సరసను పంపాడు. ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి వేరే చోటుకు వెళ్ళాడు.
ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు.
కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోర్కె మన్నించి  ధనుర్విద్యను నేర్పాడు.
మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు.

7.పరశురాముడు:-
రేణుకా జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత బృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు .శివుని ఆఙ్ఞతో తీర్ధయాత్రలు చేశాడు.శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందాడు..

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles