అందర్నీ హడలెత్తించే యాగానికి సాహసించిన కేసీఆ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తలపెట్టిన అయుత మహా చండీ యాగం బుధవారం మొదలై నిర్విఘ్నంగా సాగుతోంది. ఒక్క శృంగేరి పీఠం నిర్వహించిన యాగాన్ని మినహాయిస్తే గత 200 ఏళ్లుగా దేశంలో ఏ ఒక్కరూ ఈ యాగాన్ని నిర్వహించకపోవడంతో కేసీఆర్ మొదలెట్టిన చండీయాగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. జాతీయ మీడియా మొత్తంగా మహా చండీయాగంపై దృష్టి పెట్టి ప్రత్యేక కథనాలు వెలువరిస్తోంది. ఇటీవలి చరిత్రలో ఎవరూ ఈ యాగాన్ని నిర్వహించకపోవడానికి బలమైన కారణం కూడా ఉంది. అయిదు రోజుల పాటు కొనసాగే ఈ మహా చండీయాగంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా మహా కాళి ఆగ్రహిస్తుందని నమ్మకం.
మహాచండీ యాగాన్ని అలనాడు మహాభారత కాలంలో ధర్మరాజు నిర్వహించిన రాజసూయయాగం అంత శక్తివంతమైన యాగంగా పేర్కొంటున్నారు. ఈ యాగాన్ని మొదట మార్కండేయ పురాణంలో ప్రస్తావించారు. ఆ పురాణం ప్రకారం 10 వేలసార్లు దుర్గా శప్తసతిని యాగ విక్షరిని పఠిస్తే దుర్గాదేవి చండీమాతగా మారుతుంది. అందుకే అంత విశిష్టమైన యాగాన్ని ఎక్కడ ఏం తేడా వస్తుందో అన్న భయంతో ఎవరూ నిర్వహించడానికి సాహసించరని, కానీ కేసీఆర్ పెద్ద ప్రయోగమే చేస్తున్నారని పలువురు అంటున్నారు.
దుర్గాదేవి చండీమాతగా పరవర్తన చెందినప్పుడు ఆ యాగాన్ని నిర్వహించిన వారు ఏం అడిగితే దాన్నల్లా దేవత తీరుస్తుందని ప్రతీతి. అందుకే మహాచండీ యాగానికి వ్యతిరేకంగా ఇంతవరకు తెలంగాణలో ఏ రాజకీయవేత్త కూడా మాట్లాడటానికి, విమర్శించడానికి సాహసించలేదు. తెలంగాణ రాజకీయాల్లో అతి శక్తివంతుడిగా మారేందుకే కేసీఆర్ ఈ మహాయాగాన్ని తలపెట్టాడని చెప్పుకుంటున్నారు. కానీ చండీమాతపై భయంతోనే రాజకీయ నేతలు ఈ యాగాన్ని గురించి పల్లెత్తు మాట అనడానికి కూడా భయపడుతున్నారని తెలుస్తోంది.
1 comments:
Write commentsఅమ్మ వారు కరుణామయి...తప్పు గా పూజ చేస్తే శిక్షిస్తుందని చెప్పేవాళ్ళని అవివేకులుగా గుర్తించండి..
Reply