కలియుగంలో జన్మించబోయేవారు అలసులు, మందబుధ్ధులు, అల్పాయుష్కులు, స్వార్థపరులు , అరిషడ్వర్గాలను జయించలేని అజ్ఞానులుగా నిరూపించబడతారని అష్టాదశపురాణాల్లోనూ చెప్పారు.
కలియుగంలో మనుషుల తత్వాలను కలియుగ ధర్మాన్ని ఆదిశంకరాచార్యులు ఈవిధంగా చెప్పారు.
కలియుగంచాలా ఘోరమైనది.
మానవప్రవర్తన ధర్మశక్యంగా ఉండదు.
పాపపుణ్యవివక్షత ఉండదు.
దురాచారపరులౌతారు.
సత్యభాషణ ఉండదు.
ధనార్జనే పరమావధిగా ఉంటారు.
ఆత్మస్తుతి పరనిందతోనే కాలక్షేపంచేస్తారు.
కుటుంబాలు చీలుతాయి.
హింసరాజ్య మేలుతుంది.
పరస్త్రీ,పరధనం, పటికబెల్లంఅచ్చులా చప్పరించేస్తారు.
ఆత్మదృష్టిలేక దేహతాదాత్మ్యబుధ్ధితో కాలం వెల్లబుచ్చుతారు.
తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి గౌరవాలులేని భ్రష్టులౌతారు.
స్త్రీలను భోగసాధనంగా భావిస్తారు.
కామతంత్రపరాధీనులై ఉంటారు.
కపటస్నేహం ,కపటప్రేమ నటిస్తారు.
విప్రులు వేదాలు విక్రయిస్తారు.నీచ ధర్మప్రవృత్తి చేపడతారు.
విప్రులు సమాజంలో గౌరవస్థానం కోల్పోతారు.
మనుజులు లోభగ్రస్తులు, ఆశాపాశబంధితులు అవుతారు.
బ్రహ్మానందా న్ని అనుభవించే బ్రహ్మీభూత స్థితినుండి చ్యుతులౌతారు.
జాతిధర్మాన్నికర్మలను విడిచి వర్ణసంకరంచేస్తారు.
అహంకార, మమకార, కామ, క్రోధాలకు వశులై ఆత్మజ్ఞాన శూన్యులై అదియే నాగరికత అనిభ్రాంతి పడతారు.
సమత్వబుధ్ధి నశిస్తుంది.
శీలము నశిస్తుంది.
కలిలో క్షత్రియధర్మం నశిస్తుంది.
గో- బ్రాహ్మణ రక్షణ ఉండదు.
భోగలాలసత్వం పెరుగుతుంది.
క్రయవిక్రయాల్లో కపటత్వం అధికారుల్లో లంచగొండితనం పెచ్చుపెరుగుతాయి.
స్త్రీలలో పాతివ్రత్య ధర్మం నశిస్తుంది.
సంపాదనబట్టి భర్తను గౌరవిస్తారు.
అత్తమామలను ఆదరించరు.
అత్తమామలను ఆదరించరు.
స్త్రీలకు కేశములుండవు రత్నాభరణములపై
మక్కువ ఎక్కువ.
మక్కువ ఎక్కువ.
స్త్రీలు స్వేఛ్ఛానువర్తనులుగా ఉంటారు.అధిక సంతానము క్రమేపి సంతానపరిమితి, అంత్యముగా సంతానలేమికి ఇష్టపడతారు.
స్త్రీపురుషులు మద్యమాంసాదులకు బానిసలౌతారు.
దొంగలు పాలకులౌతారు.
ప్రజల ధన మాన ప్రాణాదులకు రక్షణ ఉండదు.
ప్రకృతిపట్ల పూజ్యభావముండదు.
ప్రకృతి ఆకృతి మార్చుకుంటుంది.
ప్రకృతి సహకరించదు.
ప్రకృతి మనుజునిమధ్య సామరస్యంలోపిస్తుంది.
ప్రకృతి విజృంభిస్తుంది.గతితప్పుతుంది.
దానికి సూచనగా...
భూమినిస్సారమౌతుంది.
సుగంధాలు పసనుకోల్పోతాయి.
పువ్వులు వాసనకోల్పోతాయి.
పండ్లలో రసముండదు.
కూరల్లో రుచిఉండదు.
పాలలో జిడ్డు ఉండదు.
సమస్త వస్తువులు తమధర్మాన్ని కోల్పోతాయి.
భూమినిస్సారమౌతుంది.
సుగంధాలు పసనుకోల్పోతాయి.
పువ్వులు వాసనకోల్పోతాయి.
పండ్లలో రసముండదు.
కూరల్లో రుచిఉండదు.
పాలలో జిడ్డు ఉండదు.
సమస్త వస్తువులు తమధర్మాన్ని కోల్పోతాయి.
ఈ సూచనలు పూర్తిగా కనిపించినరోజు కలియుగాంతమూ తప్పదు.
.....
ఆదిశంకరాచార్యుల ధర్మసూక్తము