లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ-వనితాం లోకైకదీపాంకురాం /
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ //
(క్షీరసముద్రరాజతనయాం, శ్రీరంగధామ+ఈశ్వరీం, దాసీభూత-సమస్త-దేవవనితాం, లోక+ఏక-దీప+అంకురాం, శ్రీమత్+మందకటాక్ష-లబ్ధ-విభవ-బ్రహ్మ+ఇంద్ర-గంగాధరాం, త్రైలోక్య-కుటుంబినీమ్, సరసిజామ్, ముకుందప్రియామ్, త్వామ్, (అహమ్), వందే.)
“పాలసముద్రంలో పుట్టినదానవు, శ్రీరంగమనే ధామాన్ని నియంత్రించేదానవు, దేవతాస్త్రీలందరూ సేవకురాండ్రుగా కలిగినదానవు, ఈ లోకానికి ఉన్న వెలుగుకు మూలమైనదానవు, నీయొక్క స్వల్పమైన కటాక్షం కారణంగానే బ్రహ్మ, ఇంద్ర, రుద్రాదులకు వైభవాన్ని కలిగించినదానవు, మూడు లోకాలను (భూ, భువ, సువ) కుటుంబంగా కలిగినదానవు, నీటియందు పుట్టినదానవు, విష్ణువునకు ఇష్టురాలవు - అయిన నిన్ను కొలుస్తాను (నమస్కరిస్తాను).”
అట్టి శ్రీమహాలక్ష్మి మనకందరకూ ఈ దీపావళిరోజున (తదనంతరం కూడా) శుభాలను కలగజేయాలనీ, అలక్ష్మిని (మూర్తీభవించిన దారిద్ర్యాన్ని) తొలగించాలనీ మనసారా కోరుకొంటున్నాను.
Author: sandhehalu - samadhanalu