“పురా ఆసక్తి” -పూర్వ విషయములను సృశించునది,
“పురా పినవమ్” -ప్రాచీన విషయములు చెప్పుచున్నను ఎప్పటి కప్పుడు క్రొత్తగా కనబడునది,
“పురావిశాయాన్ నయతీతి పురాణమ్” -పూర్వ సంప్రదాయములైన ధర్మాదివిషయములను మన కందించునది అని పురాణమునకు నిర్వచనములు.
“ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృహంయేత్” -ఇతిహాస పురాణముల ద్వారా వేదధర్మములను వ్యాప్తి చేయవలెను అని ఆర్యోక్తి. కావున ఆ మహాకార్యము జరిగినపుడే పురాణముల ఉనికియు, పఠణశ్రవణములును సార్థకమగును.
“స్వర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ,
వంశాను చరితంచేతి పురాణం పంచలక్షణమ్”
ఆదిసృష్టి, బ్రహ్మవలన తరువాత జరిగిన సృష్టి, రాజ, ఋషి వంశములు, స్వాయంభువాది చతుర్దశ మన్వంతరములు, ఈ మనువులనుండి వ్యాపించిన వంశములలో ప్రసిద్ధుల చరిత్రములు అను ఐదు లక్షణములు గలది పురాణము.
శ్రుతి స్మృతులలోని ధర్మములను మిత్ర సమ్మితముగా బోధించుచుండును. పురాణము లనగా భారతీయ విజ్ఞాన సర్వస్వములు. “న హి విజ్ఞాన సర్వస్వం పురాణా ద్వేదసమ్మితాత్” అని పెద్దల వాక్కు.
భక్తిభావన లేకుండ పురాణ కథలు వినుటవలన ప్రయోజనము లేదు, గాడిద గంధపుచెక్కలు మోసినట్లు పురాణశ్రవణము నిరర్థకమగును.