పవిత్రమైన యమునానది, అందులో కాళీయమడుగు, కాళీయమడుగులో కాలకూటవిషాన్ని చిమ్ముతున్న భయంకరమైన కాళీయసర్పము. అది ఎంత భయంకరమైన విషమంటే ఆ మడుగు సమీపానికి కూడా ఎవరూ వెళ్ళలేని పరిస్థితి, మడుగులోని నీరంతా విషతుల్యం.
చిన్నికృష్ణుడు ఆ మడుగులోకి దూకాడు, కాళీయుని పడగలపైకి ఎక్కి నాట్యం చేశాడు., దాని మదాన్ని అణచివేసి యమునమ్మకు విముక్తిని కలిగించాడు. ప్రజలకు మేలు జరిగింది. అందరూ సంతసించారు. క్లుప్తంగా ఈ కథ అందరికీ తెలిసిందే, కాని మడుగు సమీపంలోకి మానవులెవ్వరూ వెళ్ళలేని స్థితిలో కృష్ణుడు మడుగులో దూకినాడు కదా, విష ప్రభావం ఆయనపై ఎందుకు పడలేదు, ఆయనకు ప్రమాదం ఎందుకు జరుగలేదు అనేది సందేహం.
శ్రీకృష్ణుడు గోపాలుడు, ఎప్పుడూ గోవుల మధ్యలోనే నివసిస్తూ వాటికి ఆనందం కలిగించే గోవిందుడు. గోధూళి. గోమయంతో కూడి ఉన్న ప్రదేశంలో ఆటలాడుకునేవాడు. ఆవు పాలు. పెరుగు. వెన్నమీగడలు, నెయ్యి ఆయన ఆహారం. అంతే కాదు శ్రీకృష్ణుడు ప్రతినిత్యం గోమూత్రసేవనం చేసేవాడు. గోసేవయే ఆయన నిత్యకృత్యము. కాలకూటవిషాన్ని అయినా సరే హరించే శక్తి కలిగిన ఆవుపాలు, గోమూత్రాన్ని క్రమం తప్పక సేవించడమే కాకుండా నిరంతరం గోవుల మధ్యన వసించిన కారణాన కృష్ణుడికి భయంకరమైన విషం వలన ప్రమాదం జరుగలేదు.
తెలుసుకోండి, "విషానికి విరుగుడు పంచగవ్యాలు".