చిన్నపిల్లలు పెద్దలను అనేక ప్రశ్నలేస్తారు. కనిపించిన ప్రతీదాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.ఏమిటి? ఎందుకు? ఎలా?అని తెలుసుకునే జిజ్ఞాస వారికి ఎక్కువ. పిల్లలడిగిన అనేక ప్రశ్నలకు తల్లి దండ్రులు చెప్పిన సమాధానాలకు ఆ తరువాత పాఠశాలలో బోధించే వాటికి పొంతన లేనపుడు పిల్లలకు కొత్త ప్రశ్నలు పుడతాయి.
అదే చదువుకున్న తల్లిదండ్రులయితే శాస్త్రీయమైన సమాధానాలు చెప్పే అవకాశం ఉంది. కొంచెం పెద్ద పిల్లలు కట్టుకథలను ప్రశ్నిస్తే పెద్దలు వారిని కోపగించుకోవడం కూడా చూస్తుంటాము. తమ పిల్లలు తప్పుదోవ పడుతున్నారని, ఎవరో తమ పిల్లలకు కొత్త విషయాలను నూరిపోస్తున్నారని బాధపడతారు. తాము నమ్మిందే తమ పిల్లలు నమ్మాలని, తమ బాటలోనే పిల్లలు నడవాలని చూస్తారు. తాము ఆచరించిన మంచినే తమ పిల్లలూ ఆచరించాలని భావించే అలా ఆందోళన చెందుతారు.
పిల్లలడిగే ప్రశ్నలకు పెద్దలు ఎలా సమాధానాలు చెప్పాలి?
పిల్లలకు ప్రశ్నించడం ఎలా నేర్పాలి?
పిల్లలు ప్రశ్నిస్తే పెద్దలు కట్టుకథలు చెప్పడం సరైనదేనా?
తరానికి తరానికి మధ్య తప్పనిసరిగా పురోగతి ఉంటుంది. ఈ పురోగతిని అర్ధం చేసుకోలేక అడ్డగించే విధానాన్ని తగ్గించడానికి మార్గాలేమిటి?
పాఠ్యాంశాలలో చెప్పే నీతికి సమాజంలో జరిగే రీతికి తేడా స్పష్టంగా కనబడుతుంటుంది.ఉధాహరణకు ‘అంటరానితనం నేరం’ అని ప్రతి పాఠ్యపుస్తకంపైనా, నోటు బుక్కులపైనా ఉంటుంది. ఆచరణలో దానికి విరుద్ధంగా జరుగుతుంటుంది. కుల మతాలు లేవంటూనే అడ్మిషన్లపుడు తప్పక కులం అడుగుతారు. నీతి పాఠాలు చెప్పే టీచర్లు నీతిని తప్పి ప్రవర్తిస్తుంటారు.
బడిలో చెప్పిన పాఠాలు ప్రభావం జీవితంపైన కీలకంగానే ఉంటుంది. ఇది ఒక ఎత్తైతే కొందరు ఉపాధ్యాయులు ఆసక్తి కరంగా పాఠాలు చెపుతుంటారు. పిల్లలకు ప్రశ్నించడం నేర్పుతూ పాఠాలు బోధిస్తుంటారు. బట్టీ పట్టే విధానం, విసుగుతో సమాధానాలు కాకుండా ఓపికగా మరిన్ని ప్రశ్నలడిగేలా చెప్తుంటారు. దీనివల్ల విధ్యార్ధులలో అవగాహన పెరుగుతుంది.
ప్రశ్నించే శక్తి పెరుగుతుంది. విద్యార్ధులకు ప్రశ్నించే తత్వాన్ని అలవరచడంలో ఉపాద్యాయుల పాత్ర ఏమిటి? నేటి ఉపాధ్యాయులు పిల్లలకు ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవరచడంలో సఫలమవుతున్నారా?
చిన్నపిల్లలు పెద్దలను అనేక ప్రశ్నలేస్తారు. కనిపించిన ప్రతీదాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఏమిటి? ఎందుకు? ఎలా? అని తెలుసుకునే జిజ్ఞాస వారికి ఎక్కువ. అయితే పిల్లలడిగే ప్రశ్నలకు తల్లిదండ్రులు లేదా పెద్దలు తమకు తెలిసిన సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారు. లేదా కట్టు కథలు చెప్తారు. ఆ కట్టుకథలు వారికి వారి చిన్నపుడు వారి పెద్దలు చెప్పినవై ఉంటాయి. లేదా నీతో మేము వేగలేమురా …… అంటూ తప్పించుకుంటారు.
శాస్ర్తీయ దృక్పధం పెంచటం., పిల్లలకు విశ్లేషణాత్మక విచక్షణ నేర్పటం తల్లిదండ్రుల భాధ్యతే కదా..!?