తుకారాం ఆత్మానుభూతి పొందిన
పాండురంగ నామ మహత్వం
పాండురంగ విఠలే హరినారాయణ
పురందర విఠలే హరినారాయణ
హరినారాయణ బజే నారాయణ
శ్రీ మన్ నారా యణ సత్యనారాయణ
తుకారాం ఆత్మానుభూతి పొందిన
మహాత్ముడు , ఆయన అటు భగవంతునకి
ఇటు జనులకు సేవలందిస్తూ వచ్చాడు ...
భగవన్నామ. మహత్వాన్ని ఆయన. తన
జీవితంలో పలుమార్లు నిరూపించి చూపించాడు , అటువంటి ఒక సంఘటనను
చూద్దాం .....
ఒక. రోజు ఇరుగు పొరుగు ఇళ్ళలోని ఇద్దరు
స్త్రీల. మధ్య. ప్రారంభమైన కలహం చిలికి
చిలికి గాలివాన. అయినట్లు ఉగ్రరూపం
దాల్చింది , ఆ. స్త్రీలు ఇద్దరు కలిపి ఒకే చోట
పిడకలు తట్టారు , ఎండిన. తరువాత. అవి
ఒకటితో ఒకటి కలిసిపోయాయి , ఎవరివి
ఎన్ని అని తెలుసుకోవాడానికి సాధ్యంకాక
కలహించుకోసాగారు ,......
తుకారాం అప్పుడు ఆ దారి గుండా పోతున్నాడు , ఆయన. విషయం విన్న. తర్వాత
పిడకలను విభజించి ఇస్తానని చెప్పాడు ,..
ఎండిన. అన్ని పిడకలనూ ఆయన. ముందు
గుమ్మరించారు ,
ఆయన. ఒక్కొక్క. పిడకగా తీసి చెవి వద్ద.
పెట్టుకొని చూసి , వాటిని రెండు భాగాలుగా
విభజించాడు , ఆ. తరువాత.
" అమ్మా ! మీ ఇద్దరిలో ఎవరు పిడకలు
తట్టుతున్నప్పుడు " విఠల్ " విఠల్ ,
అని చెబుతూ వచ్చారు ? అని
ప్రశ్నించాడు ,....
నామం ఉచ్చరిస్తూ పిడకలు తట్టిన. స్త్రీ
ముందుకు వచ్చింది ,....
అమ్మా ! ఎడం వైపు ఉన్న. పిడకల. గుట్ట
నీది , కుడివైపుది ఆమెది "" అని తుకారాంచెప్పాడు , ....
ఈ. విడ్డూరం చూడడానికి వచ్చిన వారు
" స్వామి ఇదేమిటి ? .. అని ఆశ్చర్యపోతు
అడిగారు ,...
" మనం భగవన్నామం ఉచ్చరిస్తున్నప్పుడు ,
నామ. తరంగాలు చుట్టు ప్రక్కలంతా
వ్యాప్తిస్తాయి , నామ. ప్రతిధ్వనులు ఈ
పిడకల్లో నెలకొని ఉన్నాయి , అవి విని
వాటిని విభజింప. గలిగాను " అని తుకారాం వివరించి చెప్పాడు ,....
నామ జపానికి చోటు , సమయం
చూడవలసిన. అవసరంలేదు , నామజపం
మనకు శ్రేయోదాయకమేకాక. , చుట్టూ
వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది ,
పండరినాదా విఠలా పాండురంగ విఠలా
పాండురంగ విఠలాపండరినాధ విఠలా!