Thursday 1 December 2016

మోహినీ -- భస్మాసురా కథ


భస్మాసురుడు -          మోహినీ

భాస్మాసురుడిని అంతమొందించడానికి మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు
ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి చెడు జరగాలని ఆదేశించడమే శాపం. అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి మంచి జరగాలని ఆశీర్వదించడమే వరం. శాపమిచ్చినప్పుడు శాపంగానూ, వరమిచ్చినప్పుడు వరంగానూ పనిచేయడం సహజం. కానీ ఒక్కోసారి వరాలు శాపాలుగా, శాపాలు వరాలుగా మారుతాయి. శాపం తిట్టులాంటిది. వరం దీవెన లాంటిది. చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపం, పుణ్యానికి ప్రతిఫలంగా లభించేది వరం. పాపాలు శాపాలై కాటు వేస్తే, పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి. అదేలాగో తెలుసుకోవాలంటే హిందూ పురాణాల్లోని ఒక కథను మీరు చదివి తెలుసుకోవాల్సిందే. కథేంటంటారా..వరాన్ని, శాపంగా మార్చుకొన్నబస్మాసుర కథ.. ఎలాగో కథ చదవండి... 



మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర

హిందూ పురాణాలలో భాస్మసురిని కధలో శివుడు లేదా భస్మాసురుడు, మోహిని ఉంటారు. భారతీయ పురాణాలలో దేవతలు, రాక్షసుల మధ్య శత్రుత్వం గురించి వివరించబడింది. రాక్షసులు ఎప్పుడూ సమస్యలను సృష్టించే క్రూరమైన, ప్రమాదకరమైనవారైతే, దేవతలు ప్రత్యేకంగా స్వర్గంలో ఉండేవారని భావిస్తారు.

పురాణాల ప్రకారం, అలాంటి రాక్షసులను సంహరించడం దేవతల పని. భస్మాసురుని కధ చాలా పేరుగాంచింది. భస్మాసురుడు శివుని భక్తుడు. అతను శివుడి నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు కారణంగా, మహాదేవుడు కరుణించి, ఒక వరం కోరుకొమ్మన్నాడు.

భస్మాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమన్నాడు, కానీ శివుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించే శక్తి లేదన్నాడు. అప్పుడు భస్మాసురుడు తన కోరుకున్న వరం పద్ధతిని మార్చుకున్నాడు. భాస్మసురుడి తలను తమ చూపుడు వేలుతో తాకితే, వెంటనే కాలిపోయి, బూడిద (భస్మ) అవుతాడు. అది అతని డిమాండ్. శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు.

భస్మాసురుడు చాలా సంతోషించి, అధిక సంతోషంతో, మహాదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని తనమీద తనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే, అతను తన బొటన వేలితో శివుని తలను తాకాలి అనుకున్నాడు.

వెంటనే శివుడు కాలిపోయి, బూడిదైతే పార్వతిని చేపట్టాలి అనుకున్నాడు. శివుడు ఎక్కడికి వెళితే అక్కడికి భస్మాసురుడు అనుసరించాడు. చివరికి, శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించి, ఆ పరిస్థితికి కారణమైన తనను ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిష్కారం కోరాడు.

శివుడి సమస్యను విని, మహావిష్ణు అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. విష్ణు మూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి, ముందు దయ్యంగా కనిపిస్తాడు. మోహిని ఎంత అందంగా ఉంటుందంటే, భస్మాసురుడు వెంటనే ఆమెకు ఆకర్షితుడౌతాడు.

భస్మాసురుడు, మోహినిని పెళ్ళిచేసుకోమని కోరతాడు. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం, నృత్యంలో తనకు సాటిగా ఉన్నవాళ్ళను పెళ్లిచేసుకుంటానని చెప్తుంది. భస్మాసురుడు ;అందుకు అంగీకరించి, నృత్యం ప్రారంభిస్తాడు.

భస్మాసురుడు, మోహిని అడుగులకు, అడుగులను కలిపాడు, నృత్యం చేసే సమయంలో, మోహిని తన బొటన వేలిని తన తలకు తాకే భంగిమ పెట్టింది. భస్మాసురుడు ఆమెను అనుసరించాడు, అతను తన బొటన వేలిని తన తలపై ఆంచాడు, వెంటనే అతను కాలి, బూడిదైపోయాడు, తన కోరుకున్న వరాన్ని ఈ విధంగా పొందాడు.

ఈ కధకు సంబంధించి కొద్ది తేడాలు ఉన్నాయి. కానీ కధ సారాంశంలో తేడాలేదు. "కోరుకున్న వరం భస్మాసురుడు పొందాడు" అన్న నానుడి ఈ కధ ఆధారంగా పుట్టింది. తనపన్లు తనకే ఎదురుతిరిగి, విధ్వంసకరంగా మారే లక్షణాన్ని ఇది సూచిస్తుంది.                       

                                                           🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles