Tuesday 17 January 2017

బొట్టు యొక్క విశిష్టత


మన సనాతన ధర్మంలో బొట్టుకు ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. స్త్రీ, పురుషులు ఇద్దరికీ కూడా బొట్టు అంతే అవసరం. వాడు ఎటువంటి మార్గంలో  పయనించేవాడైనా కొంత సనాతన ధర్మాన్ని నమ్ముతాడు అంటే బొట్టు పెట్టుకుని తీరాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించే వారు అందరూ కూడా బొట్టు పెట్టుకుని తీరాలి. అసలు బొట్టు రెండు కనుబొమల మధ్యలోనే పెట్టుకోవడానికి కారణం మన రెండు కనుబొమల మధ్య ఆజ్ఞ్యాచక్రం ఉంటుంది. ఆ ఆజ్ఞ్యాచక్రం మీద ఎదుటి వారి యొక్క దృష్టి పడకుండా బొట్టు పెట్టుకుంటాము. మనము తీసుకునే నిర్ణయాలన్నీకూడా ఆ ఆజ్ఞ్యాచక్రం మీదే ఆధారపడి ఉంటాయి. మనము ఏదైనా వస్తువు మర్చిపోతే భ్రుకుటి ముడి వేస్తాము. అలా భ్రుకుటి ముడి వేయడం వలన మనము మర్చిపోయిన విషయాన్ని జ్ఞ్యాపకం చేస్తుంది. కాబట్టి ఇది జ్ఞ్యాపకానికి కూడా అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టుకోవడం వలన పురుషుడు శౌచాన్ని పొంది ఉన్నాడు అని అర్ధం. ఒకవేళ అతను స్నానంతో వెంటనే విభూతి ధరించి నుదుట కుంకుమ ధరిస్తే అతడు ఆశీర్వదించడానికి అర్హుడు. ఒకవేళ అతను స్నానానంతరం వెంటనే కుంకుమ ధరించకుండా ఎవరినన్నా ఆశీర్వదించవలసివస్తే అతను మరల స్నానము చేసి వెంటనే కుంకుమ ధరిస్తే శౌచాన్ని పొంది ఆశీర్వదించే అర్హత వస్తుంది. అందుకనే పురుషులు స్నానం చేసిన వెంటనే విభూతి ధరించి నుదుట కుంకుమ ధరిస్తారు. మరి పురుషుడికే బొట్టు అంత పవిత్రమైతే స్త్రీకి పంచప్రాణాలు ఆ బొట్టులోనే ఉన్నాయి.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles