పూజాకార్యక్రమాలు, వ్రతాలు, యజ్ఞాల్లో ఆవు పాలునే ఎందుకు వాడుతారని తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథనం చదవండి. గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైంది. సకల దేవతలకి గోమాత నివాస స్థలం.
ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి ఆహ్వానించినట్లవుతుంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవు పాలను వాడుతారని పండితులు చెబుతున్నారు. గృహప్రవేశమే కాదు ప్రతి శుభకార్యములో గోపూజ భారత దేశములో సర్వసాధారణం ప్రత్యేకం. దానాల్లో గోదానం అతి పవిత్రమైనదంటారు.
“సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం - సురబిం యజ్ఞాస్య జననీ మాతరం త్వానమామ్యాహం”- శ్లోకాన్ని బట్టి సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. గోమాత సర్వ శుభ రూపిణివి. యజ్ఞమునకు తల్లివంటి దానివని, ముప్పది మూడు కోట్ల దేవతలకు నిలయం గోమాతని, అందుచేతనే ఆవుపాలును శ్రేష్ఠమైందని పురోహితులు అంటున్నారు.