Monday 9 January 2017

సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము.

నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతన్న్నిస్తాయి. అయితే
"శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.
అది అలాగ ఉండగా, సోమవారం " సౌమ్యప్రదోషం" గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం.
సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు. ఇది ఐశ్వర్యకరం, సర్వాభీష్ఠప్రదం!
స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు. పై నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.
ప్రత్యేకించి ఈ సోమవారాలు శ్రావణ మాసంలోనూ, కార్తీకంలోను మరీ విశేషం. నభోవాస ఇందువాసరే - శ్రావణ మాస సోమవారాలలో ఈశ్వరారాధన మహైశ్వర్య ప్రదం
కార్తీక మాసం అంతా ' నక్తనియమం' గొప్పది. అలాగ కుదరనప్పుడు కనీసం సోమవారాలనాడు తప్పనిసరిగా చెయ్యాలి.
ఆ సాయంకాలార్చనలో, స్వామిని బిల్వాలతో అర్చన చెయ్యడం సంప్త్ప్రదాయకం.
ఇందువాసరే వ్రతంస్థిత్వా
నిరాహారో మహేశ్వరౌ
నక్తం హౌష్యామి......అని శాస్త్ర వచనం.
లక్ష్మి ప్రదమైనది ఇందువాసరం. (సోమవారం)
పార్వతిసహిత పరమేశ్వరున్ని ఆర్ధించాలి.
"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు
పార్వతి సహితుడైన పరమేశ్వరునుకి ఆరధన కార్తీక సోమవారాలలో విశేషం .
రామాద్యవతారాలలో శ్రి మహా విష్ణువు కూడా సదా శివుని అర్చించి, మనకు కారణ మార్గం ఉపదేశించారు.
శ్రీ రాముడు అగస్త్య మహర్షి ద్వారా " విరజా దీక్ష" ను స్వీకరించి, భస్మోద్ధుళితాం గుడై శివధ్యానంలో గడిపాడని "పద్మ పురాణం" చెప్తోంది.
అతడి దీక్షకు ఫలితముగ, సదాశివుడు పార్వతి సహితుడై సాక్షత్కరించి, దేవసభా మధ్యంలో, శ్రీ రామునకు సందర్శాననందాన్నిచ్చాడు.
శివూని సహస్ర నామాలతో సంస్తుతించి, ప్రసన్నుని చేసుకున్నాక తిరిగి, ఏకాంత దర్శనమిచ్చి రామునకు శివుడు చెప్పిన విషియాలే "శివ గీత" గా ప్రసిద్ధమయ్యాయి.
శ్రీ కృష్ణుడు కుడా ఉపమన్యు మహర్షి వలన శివ దీక్షను పొంది, శివారాధన చేసినట్లు, శివధర్మాలను అర్జున ధర్మరాజాదులకు ఉపదేశించినట్లు " మహాభారతం " చెప్తోంది.
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః
శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు.
శివుడు రామ కృష్ణాది విష్ణువు నామ జపం లో ఆనందతుడువుతుంటే, విష్ణువు శివార్చనలో ఆనందిస్తాడు. శివుడు పరమ వైష్ణవుడు. విష్ణువు పరమ శైవుడు.
కాబట్టి ఉభయుల పట్ల అభేద దృష్టితో దేవారధన సాగాలి.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles