Monday 9 January 2017

శ్రీ సాయి సచ్చరిత --- 7 వ అధ్యాయం

శ్రీ సాయి సచ్చరిత --- 7 వ అధ్యాయం,
         20 వ ఓ వీ తరువాత :---

🌷21. రైతులు ధాన్యం కొరత ఏర్పడితే అవసరానికి వాడుకోవటానికి, ఆ సంవత్సరంలో పండిన ధాన్యాన్ని, గోధుమలను ముందుగానే పోగుచేసి సంచుల్లో కట్టి ఉంచుతారు.
🌸22. అట్లే మసీదులో బస్తాలతో నింపిపెట్టిన గోధుమలను విసురుకోవటానికి అక్కడ తిరగలి ఉండేది. చెరగటానికి చేటలు కూడా ఉండేవి. సంసారానికి అవసరమైన వాటికి ఏ కొరతా లేదు.
💐23. సభామండపంలో శోభాయమానంగా అందమైన తులసీ బృందావనం, అక్కడే లక్షణమైన ఒక చెక్క రథం ఉండేవి.
🍀24. ఏదో పుణ్యసంచితం వల్ల ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరునితో కలయిక ఏర్పడింది. ఇటువంటి సంగ్రహాన్ని హృదయ పేడికలో సేకరించి పెడితే, ఆమరణాంతం ఏ లోటూ కనిపించదు.
🌼25. ఏదో పూర్వార్జిత సౌభాగ్యం వలన బాబా పాదాల వద్ద ఆశ్రయం లభించి మనకు శాంతి, ప్రాపంచిక వ్యవహారాల్లో నిశ్చింత కలిగాయి.
🍁26. తరువాత ఎంత సుఖాన్ని సంపాదించినా ఈ సుఖం మరల రాదు. శ్రీ సాయి సమర్థుని సమాగమంలో లభించిన ఆనందాన్ని అనుభవించి నేను ధన్యుణ్ణయ్యాను.
🌺27. పరిపూర్ణ నిశ్చలత్వానికి, అత్మానందానికి నిలయం సాయి. వారి విశిష్టతను నేను ఎలా వర్ణించను ? వారి చరణాలను ఆశ్రయించిన వారు అక్కడే స్థిరపడిపోయారు.
🌻28. మృగచర్మాన్ని, దండాన్ని పట్టుకొని తిరగే తాపసులు, హరిద్వారాది తీర్థక్షేత్రాలలోని వారు, సన్యాసులు, త్యాగులు, బైరాగులు మొదలయున అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు.
🌸29. బాబా మాట్లాడుతూ, తిరుగుతూ నవ్వుతూ ఉండేవారు. వారి జిహ్వపై నిరంతరం 'అల్లా మాలిక్' అన్న నామం ఉండేది. వారికి వాదాలు, వితండ వాదాలు అయిష్టం. వారివద్ద ఎల్లప్పుడూ సటకా ఉండేది.
🌷30. వారు గొప్ప తపస్వి. మనోవికారాలను అణచి వేసి ఇంద్రియాలను నిగ్రహించినవారు. వారి వాక్కు నుండి పూర్ణ వేదాంతం స్రవిస్తుంది. చివరికి వారి అంతు ఎవరికీ చిక్కలేదు.
ఓం సాయిరామ్

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles