మానవ ధర్మాలను మూర్ఖం గానో, గుడ్డిగానో ప్రవేశ పెట్టలేదు; ప్రతి ధర్మం వెనుక ఒక ప్రయోజనం వుంది... ప్రతి ఆచారం వెనుక ఒక ఆలోచన ఉంది... హిందూ ధర్మం లోనే కాదు ప్రతి మతం లోను ధర్మ ప్రయోజనం వుంది.
స్త్రీలకు ఇవ్వవలసిన స్థానమేమిటో చెప్పకుండానే చెప్పింది హిందూ మతం...బ్రహ్మ దేవుడు సరస్వతి ని తన వాక్కు లో దాచుకున్నాడు; విష్ణువు లక్ష్మిని తన హృదయం లోను, శివుడు పార్వతిని తన అర్ధ శరీరం లోను దాచుకొని సముచిత స్థానం ఇచ్చారు..
భార్య కూడా దేవతా సమానురాలే!. ఏ ధర్మశాస్త్రము, భార్యను తక్కువగా చూడమని చెప్పలేదు. అన్ని విషయాలలోనూ స్త్రీలకూ ఆధిపత్యం కల్పించారు పూర్వులు. ధనానికి అధిదేవత లక్ష్మి దేవి, విద్యకు అధిదేవత సరస్వతి దేవి! శక్తి కి అధి దేవత పార్వతి దేవి; వేద శాస్త్రాలకు అధి దేవత గాయత్రీ దేవి...
స్త్రీలకు ఇవ్వవలసిన స్థానమేమిటో చెప్పకుండానే చెప్పింది హిందూ మతం...బ్రహ్మ దేవుడు సరస్వతి ని తన వాక్కు లో దాచుకున్నాడు; విష్ణువు లక్ష్మిని తన హృదయం లోను, శివుడు పార్వతిని తన అర్ధ శరీరం లోను దాచుకొని సముచిత స్థానం ఇచ్చారు..
భార్య కూడా దేవతా సమానురాలే!. ఏ ధర్మశాస్త్రము, భార్యను తక్కువగా చూడమని చెప్పలేదు. అన్ని విషయాలలోనూ స్త్రీలకూ ఆధిపత్యం కల్పించారు పూర్వులు. ధనానికి అధిదేవత లక్ష్మి దేవి, విద్యకు అధిదేవత సరస్వతి దేవి! శక్తి కి అధి దేవత పార్వతి దేవి; వేద శాస్త్రాలకు అధి దేవత గాయత్రీ దేవి...
భార్య అంటే అర్ధాంగి అన్నారు పెద్దలు. అర్ధాంగి అంటే పురుషునిలో సగభాగం.మాతృ భూమి, మాతృ భాష అనటం స్త్రీని గౌరవించటమే; భర్త దేవుడైతే అర్ధాంగి దేవతే అవుతుంది.
అయితే పతియే ప్రత్యక్ష దైవం అని ఎందుకన్నారు అంటే....ఈ సృష్టి పురుష ప్రధానం గా జరిగింది.... దైహికంగా పురుషుడు బలవంతుడు కాబట్టి గృహానికి అతడే ముఖ్యస్థానం అతడే పొందాడు. ఏ రకంగా నైనా సంపాదించి స్త్రీని పోషించ వలసిన భాద్యత పురుషునికే వుంది. పిల్లల్ని కనటం పెంచటం స్త్రీల భాద్యత గా అయింది.
వేల సంవత్సరాలకు పూర్వం మానవులు గుంపులు గుంపులుగా జీవిస్తుండేవారు. స్థిర నివాసం వుండేది కాదు. అప్పటికింకా 'గ్రామాలు' పుట్టలేదు. ఒక గుంపులోని ఆడవారిని వేరొక గుంపులోని ఆడవారు ఎత్తుకు పోతుండేవారు.తమ వద్దనే శాశ్వతం గా వుంచేసుకొనే వారు. ఈ స్థితిలో పురుషులకు ఆడవారిని రక్షించుకొనే అదనపు భాద్యత వచ్చి చేరింది.... పగలు ఆహారం సంపాదించటం రాత్రిళ్ళు కాపలా కాయటం పురుషుల కర్తవ్యం గా వుండేది... ఆహరమిచ్చి రక్షించే వాడు ప్రత్యక్ష దైవమే కదా!.. ఈ విధంగా పురుషారాధన ప్రారంభమయ్యింది. భరించేవాడు భర్త కాబట్టి భర్తను దైవ సమానుడుగా గౌరవించారు భార్యలు.