Showing posts with label మోక్షమార్గం. Show all posts
Showing posts with label మోక్షమార్గం. Show all posts

Monday 9 January 2017

మీరూ నేర్చుకోవలసిన ప్రాకృతిక రహస్యం ఇది

శంకరన్ పిళ్ళై ఉద్యోగార్ధం అరేబియా దేశం వెళ్ళాడు. రాజుగారికి క్షవరం చేసే పని దొరికింది.
జీతం మంచిది. శంకరన్ పిళ్ళై తను దాచిన మొత్తానికి బంగారం కొన్నాడు. అది ఒక బత్తాయిపండు సైజులో వుంది. దానిని తన క్షురకపెట్టేలో దాచాడు.
ఒకసారి రాజు క్షవరం చేయించుకుంటూ, అడిగాడు, "మన పాలనలో మనుషులేలాగున్నారు?" అని.
"బాదుషా, మీ పాలనకేం కొరత? ఒక్కోకడి దగ్గరా కనీసం బత్తాయంత బంగారం వుంది" అన్నాడు.
రాజు తన మంత్రికిది చెప్పి, సంతోషపడ్డాడు. "రేపు ఇదే ప్రశ్న శంకరన్ పిళ్ళైను అడిగి చూడండి" అన్నాడు.
ఆ రాత్రి శంకరన్ పిళ్ళై దాచిన బంగారాన్ని దొంగలించడానికి మంత్రి తగిన ఏర్పాట్లు చేశాడు. మర్నాడు శంకరన్ పిళ్ళైను రాజు అదే ప్రశ్న వేశాడు.
శంకరన్ పిళ్ళై ముఖం వేలాడబడింది. "చెప్తే తప్పుగా అనుకోరు కదా బాదుషా! మీ పాలనలో ఎక్కడ చూసినా దొంగతనం, కొల్లగొట్టడం, దారికాయడమే! కనీసం బత్తాయంత బంగారం కూడా దాచుకోలేకపోతున్నారు ప్రజలు" అంటూ బాధపడ్డాడు.
శంకరన్ పిళ్ళై తన పరిస్థితిని ఆధారంగా చేసుకుని, ఒక రాజ్యం స్థితిగతుల్ని లేక్కించినట్టే మీరూ, మిమ్మల్ని దృష్టిలో వుంచుకొని, చుట్టూ వున్న అందరి జీవితాలు నాశనమయ్యాయని తీర్పు చెప్తున్నారు.
ఆర్దికంగా వెనుకబడి వున్న మన దేశం ఊపందుకొని కదంతోక్కుతూ ముందంజ వేయడాన్ని మీరు రెండు చేతులూ జాచి ఆహ్వానించండి. ఈ పరిస్థితికి వ్యతిరేకమైన ఆలోచన కూడా మీ మనసులో రానియకండి.
మీ వసతిని తగ్గించారని, ఎవరినో ఏదో అనడం మానండి. అన్ని అయిపొయాయను కోవద్దు.
మీరు ఎదగడానికి, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. మార్పులకి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఏ క్షణమూ అలాగే వుండిపోదు, మార్పే జీవితానికందం. మార్పును మనసారా అంగీకరించడానికి తయారవకపోతే జీవితంలో బాధా, వేదనా మిగులుతాయంతే! మీరూ నేర్చుకోవలసిన ప్రాకృతిక రహస్యం ఇది.
------ సద్గురు జగ్గీ వాసుదేవ్ -----
Sent by Ashwin Kumar Dulluri

గురువు అవసరం ఏమిటి?


ప్రతి జీవి పరిపూర్ణత పొందాలి. మన వర్తమాన స్థితి, మన పూర్వ కర్మ, మన పూర్వాలోచన మనకు పరిపూర్ణత అందజేస్తుంది. అలాగే మన భవిష్యత్తు అనేది మన ప్రస్తుత కర్మలకు, భావములకు ఫలితం. ఈ కర్మలను, భావములను సక్రమమైన మార్గంలో నడిపించడానికి ఒక ఉద్దీపన శక్తి  కావలసి వుంటుంది. ఆ ఉద్దీపన శక్తి లభించినప్పుడు ఆత్మ శక్తి సామర్థ్యాలు ఉద్దీపన చెందుతాయి. పారమార్థిక జీవితము ప్రబోధాన్ని పొందుతుంది. అభివృద్ధికి చురుకు కలుగుతుంది. అంత్యమున మానవుడు పావనుడై పరిపూర్ణత పొందుతాడు.
ఆత్మ శక్తి సామర్థ్యాలను ఉద్దీపన చేసే శక్తిని పుస్తకాల నుంచి పొందలేం. ఒక ఆత్మ ప్రేరణ పొందాలంటే మరో ఆత్మద్వారానే సాధ్యమవుతుంది. దీనికి మరో మార్గం లేదు. యావజ్జీవం గ్రంథ పఠనం చేసేవారు, మహా పండితులు కూడా ఆత్మను ఉద్దీపన చేసే శక్తి సహాయం పొందలేకపోతే ఆత్మ వికాసం పొందలేం. గ్రంథాలను, పురాణాలను పఠనం చేయడం వల్ల మనం ఆత్మవికాసం పొందుతూ వుంటామని అనుకుంటూ వుంటాం. కానీ అది కొంతవరకే నిజం. గ్రంథ పఠనం వల్ల కలిగే ప్రతిఫలాన్ని పరిశీలించినట్టయితే, గ్రంథ పఠనం వల్ల మనకు కొంత ధైర్యం వస్తుందనే మాట మాత్రం వాస్తవం. అయితే అంతరాత్మకు మాత్రం ఒరిగే ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే. ఆధ్యాత్మిక విషయాల గురించి అద్భుతంగా మాట్లాడగలగే వ్యక్తుల కూడా అనుష్ఠానానికి, నిజమైన పారమార్థిక ఆచరణలకు వచ్చేసరికి వెనకబడిపోతూ వుంటాడు. దీనికి  కారణం ఆ వ్యక్తి ఆత్మకు మరో ఆత్మ నుంచి తగిన ప్రేరణ శక్తి లభించకపోవడమే.
మరి అలాంటి ప్రేరణ శక్తి మన ఆత్మలకు అందించే మరొక ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ ఎవరిదో కాదు.. గురువుది. ఇలాంటి ప్రేరణ శక్తిని ప్రసరింపజేసే వ్యక్తి గురువు. ఆ శక్తిని స్వీకరించేవారు శిష్యులు. గురువు ఈ ప్రేరణ శక్తిని ప్రసరింపజేసే శక్తిని కలిగి వుండాలి. అలాగే శిష్యుడికి కూడా ఆ శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా వుండాలి. ఎలా వుండాలీ అంటే, విత్తనం నాటితే మొలకెత్తించడానికి సిద్ధంగా వుండే సారవంతమైన భూమిలా వుండాలి. అప్పుడే గురువు అందించే శక్తి ఆ వ్యక్తిలో బీజంలా పడి, సాధన ద్వారా భవిష్యత్తులో మహా వృక్షమవుతుంది.
గురువు నుంచి తత్వాన్ని గ్రహించే శిష్యుడు తాత్కాలికావేశాన్ని, భావావేశాన్ని పొందుతూ వుంటాడు. అదే జ్ఞానమని భ్రమపడుతూ వుంటాడు. గురువు శిష్యుడి వెంటే వుంటూ, అతనిలో కలుగుతున్న భ్రమలను గమనించి, వాటిని అతని నుంచి దూరం చేయడానికి తనవంతు సహాయం అందిస్తాడు. గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు కదా.. ఆత్మజ్ఞానం అనే విద్యను నేర్చుకోవడానికి గురువు తప్పనిసరిగా అవసరం. ఈ జ్ఞాన మార్గంలో గురువు దీపంలా ఉపయోగపడతాడు. ఈ మార్గంలో గురువు లేకుండా ప్రయాణించడం అంటే, చీకటిలో చేతిలో దీపం లేకుండా ప్రయాణించడంతో సమానం.

Tuesday 3 January 2017

పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?


కల్యాణ గ్రహం

 సీజన్అందం.... ఆదాయం...
వంశం... వారసత్వం....
గుణం... గోత్రం...
వీటన్నింటికీ లెక్కలుంటాయి.
ఆ లెక్కలు సరిపోవు.
గ్రహం, రాశి, నక్షత్రం, ముహూర్తం....
ఈ లెక్కలు కూడా తేలాలట.
అవునంటారా? కాదంటారా?

మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.

వివాహానికి వధూవరుల జాతకాలలో పొంతన అవసరమా? పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?
ప్రపంచంలోని మిగతా దేశాలలో, మిగతా మతాల వారు జాతకాలు పట్టించుకోవడం లేదు కదా. అక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా. మరి హిందూ ధర్మంలోనే ఎందుకు? ఏయే జాతకాల అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఎవరెవరికి వద్దని శాస్త్రం చెబుతోంది?

ఇవి తరచూ తలెత్తే ప్రశ్నలు. కాని  అందమైన జీవితం కావాలంటే  జాతకాలు చూసుకోవాలి అంటున్నారు జ్యోతిష్యులు. వివాహానికి వధూవరుల జీవితాలలో పొంతన కుదరాలంటున్నారు. జాతకాలు కలిస్తే వారు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటున్నారు. వివాహాది శుభకార్యాలకు పునాది అయిన శ్రావణ మాసం మొదలు కానున్న సందర్భంగా ఈ విషయమై ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సెమినార్ కూడా నిర్వహించారు జ్యోతిష్య పండితులు. ఇంటా బయటా కొన్ని అభిప్రాయాలు...

కనీసం అరవై శాతం కలవాలి....
భూమి మీద ఉన్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని శాస్త్రాలు, సైన్సు అంగీకరించాయి. దీనిని కాదనడానికి లేదు. ఉదాహరణకు చూడండి. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి. కాని అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తాం. కారణం ఈ జాతక దోషాలే. వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలి. జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాసులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు,  వాటి మైత్రి... ఇలా అన్ని విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అని వివాహం నిర్ణయించాలి. విదేశాలలో, మన దేశంలో జాతకాలు చూడకుండా చేసుకున్న వివాహాలు జయప్రదంగా ఉన్నాయంటే అది పూర్వజన్మ సుకృతం. లేక కాకతాళీయంగా జాతకాలు కలిసే ఉంటాయి. నా అనుభవంలో ఇలాంటివి చాలా చూశాను.
            - గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష పండితులు

జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం
నవగ్రహాల ప్రభావం మన జీవితంలో 12 కోణాలుగా ఉంటుందని, జన్మించిన సమయంలో ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, మన జీవితంలో మంచిచెడులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రం సాధికారికంగా చెబుతోంది. కాబట్టి ఆ శాస్త్ర నియమాలను జీవితంలో ప్రధాన ఘట్టమైన వివాహానికి కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. భారత ఉపఖండంలో పుట్టి పెరిగేవారి కోసం ఇక్కడ భూమి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాలను, డిగ్రీలను బట్టి, ఫలితాలను నిర్ణయించే శాస్త్రం ఏర్పడింది. మనలాగే గ్రీకు దేశంలో జ్యోతిషం ఉంది. మన రాసులను వారు వేరు వేరు పేర్లతో పిలుస్తారు. జాతకాలు చూసేటప్పుడు నక్షత్రాలు ప్రధానం. ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుట్టారనేదాన్ని బట్టి చూస్తారు. అంటే అవతల వ్యక్తి గురించి ప్రాథమిక సమాచారం సేకరించడమన్నమాట. ఏ లగ్నంలో పుట్టారో, ఆ గ్రహం నుంచి లెక్కించాలి. జాతకాలు చూడకుండా వివాహం చేసినా కలసి జీవించవచ్చు. కోడి కూసినా కూయకపోయినా తెల్లవారుతుంది. అయితే కూసినప్పుడు లేవాలి అనుకుంటే, సరైన సమయంలో మేల్కొంటాం. లేదంటే ముందుగా కాని, ఆలస్యంగా కాని మేల్కొంటాం. జాతకం కూడా అంతే. జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం.
          - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పండితులు

శని ఉప్పు.... కుజుడు నిప్పు...
జ్యోతిష్యం హిందూధర్మం మాత్రానికే అని ఎవరన్నారు? అది ప్రపంచమంతా ఉంది. అరేబియన్లు, గ్రీకులు, చైనీయులు అందరూ నమ్ముతారు. అక్కడ కూడా జాతకాల మీద పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. యజమాని ఒక ఉద్యోగిని తీసుకునేటప్పుడు ఆ ఉద్యోగి తనకు అనుకూలుడో కాదో అని తెలుసుకోవడానికి కూడా జాతకం చూస్తారు. ఒక స్నేహితుడు మనకు తగినవాడా కాదా, ఒక ఊరు మనం నివసించడానికి యోగ్యమా కాదా అని చూస్తారు. కొడుకు జన్మించినప్పుడు వాడు శత్రువు అవుతాడా, మిత్రుడిలా ఉంటాడా అనే విషయం కూడా జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. నక్షత్రాలకు రాసులకు స్వభావం ఉంది. ఏ నక్షత్రానికి, ఏ నక్షత్రం సరిపడుతుందో చూసుకోవాలి. ఏ రాశిలో పుట్టినవారికి ఏ రాశివారితో సరిపోలుతుందో చూసుకోవాలి. శని ఉప్పులాంటివాడు. కుజుడు నిప్పు లాంటివాడు. ఉప్పు నిప్పు కలిస్తే మంట పెరుగుతుంది. గురువు చంద్రుడు ఒకచోట చేరితే సంతోషం, ఆనందం ఉంటాయి. కొన్ని నక్షత్రాలకు కొన్ని నక్షత్రాలే కలుస్తాయి. అగ్నితత్త్వం వారికి జల తత్త్వం వారితో పొంతన కుదరదు. ఒకరు ఊసురోమంటూ ఉంటే ఒకరు ఎగిరెగిరిపడుతుంటారు. మ్యాచింగ్‌లో ఇవన్నీ చూస్తాం. కనుక ఒక జంటకు వివాహం చేసేటప్పుడు ఆ ఇద్దరూ కలిసి జీవించగలిగే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి.
                 - భీమా సాంబశివరావు, జ్యోతిష పండితులు

కుజదోషం వల్ల ఇబ్బంది ఉంటుంది....

మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.   జ్యోతిష్యం అంటే గమనంలో ఉన్న ముళ్లను ఏరుకుంటూ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే దిక్సూచి. గతంలో పన్నెండేళ్లు నిండకుండానే వివాహాలు చేసేవారు. అందువల్ల నక్షత్రాలు చూసేవారు. మఖ మామగారికి, జ్యేష్ఠ బావగారికి, ఆశ్లేష అత్తగారికి గండం అనేవారు. ఇప్పుడు పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తరవాత చేస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్రాల ప్రస్తావన అనవసరం. నక్షత్రాలకు పరిష్కారం ఉంది, గ్రహాలకు లేదు. కుజుడు అగ్ని తత్త్వ కారకుడు. వివాహాన్ని పాడు చేయడానికి చూస్తాడు. దోషపరిహారం ఎంతవరకు ఉన్నదో చూడాలి. కుజదోషం వల్ల వియోగం, విరహం, కలహం కలుగుతాయి. కొందరు సమాజం కోసం కలిసే ఉంటారు. కాని వారి వైవాహిక జీవితం సరిగా ఉండదు. కొందరిలో మాత్రం సంతానం కలిగితే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబం బలపడుతుంది.  ఎవరి జాతకం వారు చూసుకోకుండా ఇంటికి రాబోయే అమ్మాయి జాతకం చూడటం సరికాదు. నక్షత్రాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, గ్రహాల అనుకూలత చక్కగా చూసుకోవాలి
    - విశ్వనాథ కనకమహాలక్ష్మి, జ్యోతిష, వాస్తు నిపుణులు

జీవి పుట్టుక ఏది?
జాతకాలన్నీ పుట్టిన తేదీ, సమయం ఆధారంగా రూపొందుతాయి. అయితే జీవి ఆవిర్భావం ఎప్పుడు? తల్లి గర్భంలో అండం- శుక్రకణాలు ఫలదీకరణ చెందినప్పుడే మనిషి జీవం మొదలవుతుంది. అదే అసలైన పుట్టుక. తల్లి గర్భం నుంచి బయటపడడం అనేది కొనసాగింపు మాత్రమే. జీవం ఎప్పుడు మొదలైందనేది రెండు-మూడు రోజుల తేడాలో ఒక అంచనాకు రావచ్చు. కానీ కచ్చితమైన సమయాన్ని చెప్పలేం. అలాంటప్పుడు జాతకాలు రాయడానికి ఏది ఆధారం? ఇప్పుడు ఎక్కువ డెలివరీలు సిజేరియన్‌లే. అది కూడా ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్‌లు చేయించుకుంటున్నారు. అలా పుట్టిన బిడ్డ జాతకం కచ్చితంగా బాగుండి తీరాలి కదా! అలాగే జరుగుతోందా? నవగ్రహాల ఆధారంగా జాతకాన్ని నిర్ణయిస్తారు. మరి సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు నీడలు. నాలుగు పోగా మిగిలినవి ఎన్ని? మరి నవగ్రహాలనే మాటకు తావెక్కడ? అయితే ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి మనోభావాలనూ గాయ పరచకూడదు. మన రాజ్యాంగం కూడా నమ్మకాలను ఆమోదిస్తోంది. నేను చెప్పే మరో విషయం  ఏమిటంటే... పెళ్లి చేసుకునే అబ్బాయి తన జాతకం మంచిదనే నమ్మకంతో ఉండడం తప్పుకాదు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని జాతకం కలవలేదని నిరాకరించవద్దు. జాతకం కలిసిందని ఇష్టం లేని అమ్మాయిని చేసుకోవద్దు. అన్ని రోజులు దేవుడు సృష్టించినవే అయినప్పుడు కొన్ని  మంచివి, కొన్ని  చెడ్డవి ఎందుకుంటాయి? అన్నీ మంచిరోజులే.
                 - డాక్టర్ బ్రహ్మారెడ్డి, జనవిజ్ఞానవేదిక స్థాపకులు

పంచభూతాలతో కనెక్షన్
జాతకమనేది ఫిజికల్ ఫిట్‌నెస్‌ని చూపుతుంది. ఇద్దరిలో ఎలాంటి పాజిటివ్, నెగిటివ్‌లు ఉన్నాయో చెబుతుంది. సంతానం కూడా తెలుస్తుంది. లోపాలు పసిగట్టవచ్చు. ఇగో ప్రాబ్లమ్స్ కూడా చూడవచ్చు. జాతకమంటే ప్రకృతి. ఒకరికి నీరు పడుతుంది, ఒకరికి ఎండ పడుతుంది. నీళ్లు జల్లితే అగ్ని ఆరుతుంది. అవే నీళ్లను అగ్ని మీద పెడితే సలసల మరిగి ఆవిరవుతాయి. పంచభూతాలకి, శరీర నిర్మాణానికి ఉన్న కనెక్షన్ జ్యోతిష్యం. హెచ్చుతగ్గులను ఎలా సవరించుకుని, పాటించాలో చెబుతుంది. చైనీయులు న్యూమరాలజీ నమ్ముతారు. అమెరికన్లు పుట్టినతేదీని ఆధారంగా చేసుకుని వివాహాలు నిశ్చయిస్తారు. వారు మనసుకి ప్రాధాన్యత ఇవ్వరు. శరీరాకృతి, ఆకర్షణలకు ప్రాధాన్యం ఇస్తారు.  మనదేశంలో అలా కాదు. మంచి కుటుంబమా కాదా అని చూస్తారు. ఇంటిపేరుని బట్టి సంబంధాలు నిశ్చయించుకుంటారు. కనుక శాస్త్రాన్ని పాటించడంలో తప్పులేదు.
                            --ఉషా అన్నపూర్ణ (ఎం.ఏ ఆస్ట్రాలజీ)

Saturday 31 December 2016

మంగళసూత్రం’వెనుక దాగి ఉన్న శాస్త్రీయమైన కారణాలు.



హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
" మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! "


భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం రెండు కుటుంబాలు, రెండు దేహాల కలయిక కానే కాదు, అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన శక్తి సంబంధిత అనుకూలత ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పుడే వివాహాన్ని నిశ్చయించే వారు. చాలా సార్లు అసలు వివాహం చేసుకోబోతున్న ఇరువురు ఒకరినొకరు పెళ్లి రోజు దాకా చూసుకునే సందర్భం కూడా ఉండేది కాదు. అయినా అది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే వారి మధ్య సయోధ్యను కుదిర్చిన వారు, ఆ జంట కంటే ఆ విషయం బాగా తెలిసిన వారు. వధూవరుల వివాహ సమయానికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసేవారు.
 

‘మంగళ సూత్రం' అనగా పవిత్రమైన సూత్రం'(దారం). ఈ పవిత్రమైన సూత్రాన్ని తయారుచేయటం విస్తృతమైన శాస్త్రం. కొన్ని వడికిన నూలు దారాలను తీసుకొని, పసుపు కుంకుమలు రాసి ఒక పద్దతిలో శక్తిమంతం చేస్తారు. ఒకసారి ముడి వేస్తే ఈ జీవితానికే కాక ఆపైన కూడా నిలిచి ఉండేలా మంగళ సూత్రం తయారుచేసే వారు. ఆ ఇద్దరిని కలిపి ముడి వేసుందుకు వారు వినియోగించిన విధానాలు కేవలం భౌతిక, మానసిక స్థాయిలోనే కాక వారి నాడులు కూడా కలిపి ముడి వేయటం వల్ల అదే జంట అనేక జీవితాల పర్యంతం అలా కలిసి ఉంటుంది.
 
భౌతికమైన, మానసిక, భావావేశ స్థాయిల్లో చేసేది ఏదైనా మరణంతో పూర్తి అయి పోతుంది. కానీ శక్తి స్థాయిలో చేసేది శాశ్వతంగా మిగులుతుంది. ఎంతో గాఢంగా, మన అవగాహనకు అందని విధంగా ఎలా ముడి వేయాలో తెలిసిన వారిచే ముడి వేయటం వల్ల ఆ బంధం గురించి పునరాలోచన చేసే ప్రశ్నే లేదు. ఇదే క్రతువు ఈనాడూ జరుగుతున్నా ఏమీ తెలియని వారిచేత జరుపుతున్నారు. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోవటం వల్ల అది నిరర్ధకం. ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడేటపుడు, వారు కేవలం భావోద్వేగపరంగానే మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు నేడొకటి చెపితే రేపొకటి చెప్తాయి. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండక్కరల్లేని పరిస్థితి వచ్చింది.
 

వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షలు చెబుతారు. ఆధ్మాత్మిక, సాంఘీక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పట్టిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్ధేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఈ ప్రమాణాలను త్రికరణ శుద్దిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. ఆ సంబంధం నిండునూరేళ్ళు పవిత్రంగా పచ్చగా ఉంటుంది.
 
వివాహ తంతులో మాంగల్య ధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాలి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం పలురూపాల్లో ఉంటాయి. మానవులకు మనువాడం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. పెళ్లికోసం సమకూర్చుకున్న, ఇవచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులు, ఆభరణాలు అన్నీ రూపాంతరం చెందినా చివరి వరకూ వెంట ఉండేది తాళిబొట్టు మాత్రమే. 🙏🌺🙏

Friday 30 December 2016

రమణ మహర్షి !



ఎవరి బోధా లేకుండా, తనంత తానే ఆత్మజ్ఞానిగా రూపొందినవారు రమణ మహర్షి. సుఖదుఃఖాలకు అతీతంగా జీవించి, ‘మహర్షి’ పేరును సార్థకం చేసుకున్నారు. ఆయనలో అప్రయత్నంగా కలిగిన ఆత్మవిచారం సహజ నిర్వికల్ప స్థితికి దారితీసింది. అరుణాచలం ఆయనకు ఆధ్యాత్మిక కేంద్రమైంది. అది ఈశ్వరుడి హృదయ స్థానం. ఆ జ్యోతిర్లింగ దివ్యకాంతులు రమణులపై ప్రసరించాయి.
అది 1879 డిసెంబరు 30. తమిళనాడులోని తిరుచుజి గ్రామవాసులైన అలగమ్మ, సుందరమయ్యర్‌ దంపతులకు వేంకటరామన్‌ జన్మించారు. అదే రమణమహర్షి అసలు పేరు. ఆ బాలుడు దిండిగల్‌ బడిలో సాధారణ విద్యార్థి. చదువు అంతగా పట్టుబడకున్నా, ఏకసంథాగ్రాహి కావడం వల్ల అన్నింటా నెగ్గుకొచ్చాడు. మధుర మీనాక్షిని దర్శించి, ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు.
చదువుపై అతడి అశ్రద్ధ చూసి అన్న మందలించాడు. ఈ లౌకిక విద్యలన్నీ వ్యర్థమని వేంకటరామన్‌కు స్ఫురించింది. ఇల్లు వదిలి తిరువణ్ణామలై వెళ్లారు. భూగర్భ మందిరంలో ధ్యాన నిమగ్నుడయ్యారు. ఆయనను దర్శించేవారి సంఖ్య పెరిగింది. ఒకరోజు కుమారుణ్ని వెతుక్కుంటూ తల్లి వెళ్లింది. ఆమెకు పెన్సిల్‌తో ఒక సందేశం రాసిచ్చారు... ‘ప్రతి ప్రాణికీ కర్మను అనుసరించి జీవితం ఉంటుంది. అతడు ఎంత ప్రయత్నించినా, జరిగేది జరగక మానదు’ అని!
ఆయనకు ఉపన్యాస ధోరణి లేదు. శిష్యుల సందేహాలకు సూటిగా సమాధానాలిచ్చేవారు. అనేక దేశాల నుంచి పలువురు తమ సందేహాలు తీర్చుకోవడానికి రమణ మహర్షిని ఆశ్రయించేవారు. ఆత్మజ్ఞానం కలిగినవాడే ‘గురువు’ అని ఆయన చెబుతుండేవారు.
‘శ్రీరమణ సద్గురు’ అని శిష్యులు ఆయనను పిలిచేవారు. జిజ్ఞాసువుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు ‘శ్రీరమణ గీత’గా ప్రసిద్ధి చెందాయి. హంఫ్రీస్‌ అనే పాశ్చాత్యుడు ఓ అంతర్జాతీయ మనోవిజ్ఞాన శాస్త్ర పత్రికలో రాసిన వ్యాసం వల్ల, ఆయన ప్రఖ్యాతి అంతటా వ్యాపించింది. సూరినాగమ్మ ‘రమణాశ్రమ లేఖలు’ తెలుగు ప్రజలకు ఆయనను మరింత చేరువ చేశాయి. ‘ఎ సెర్చ్‌ ఇన్‌ సీక్రెట్‌ ఇండియా’ గ్రంథకర్త పాల్‌ బ్రంటన్‌- రమణ మహర్షి వైభవాన్ని స్తుతించారు. మనశ్శాంతి కోసం వెళ్లిన కావ్యకంఠ గణపతి ముని ఆయనలోని మహాపురుషుణ్ని దర్శించారు.
శ్రీరమణుల భూతదయకు అంతు లేదు. పశుపక్ష్యాదులను ఆదరంగా చూసేవారు. కోతులు, ఉడతలు, పిచ్చుకల పట్ల దయాభావం చూపేవారు. జంతుభాష ఆయనకు అర్థమయ్యేది. ఒకరోజున ఓ ముసలి కోతి భుజాన కోతిపిల్ల ఉండటం చూశారు. ‘తాతా! ఎంత కష్టం వచ్చింది నీకు... ఈ వయసులో బిడ్డను పెంచాల్సి వచ్చిందే... జాగ్రత్తగా సాకు... ఇది నీకు పుణ్యమే’ అన్నారు గద్గద స్వరంతో. ఆ కోతిపిల్లకు తల్లి చనిపోయింది. తల్లిలేని పిల్లను పెంచాల్సిన బాధ్యత పెద్ద కోతిదే! ఈ విషయం మహర్షికి తెలుసు. అలాగే ఆయన ఒక గోవుకు లక్ష్మి అని పేరుపెట్టి పెంచారు.
కృష్ణుడు రేపల్లె విడిచి వెళ్లేటప్పుడు గోపికల శోకం, రామాయణ గాథలో ‘తారా విలాపం’ కథాభాగం వింటున్నప్పుడు- అనుభూతితో ఆయనకు కన్నీళ్లు ఆగేవి కావు. అదీ రమణ మహర్షి మనసు! అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాన్ని సైతం అతి సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు.
శ్రీరమణులు ‘ఆత్మవిచారం’, ‘నేనెవరు’ అనే గ్రంథాల్ని రచించారు. ‘భగవంతుడు శాశ్వతుడు. ఎక్కడికీ పోడు!’ అని బోధించారు. ‘నేను ఎప్పటికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను’ అని చెప్పేవారు. అరుణాచలంలోని రమణాశ్రమంలో ఆయన ఉన్నారనే దివ్యానుభూతి సందర్శకులకు ఇప్పటికీ కలుగుతుంటుంది. మహర్షి కరుణపూరిత నేత్రాలు వారిపై ప్రేమామృతాన్ని వర్షిస్తుంటాయి. అద్భుత సందేశాలు వారికి ఇంకా వినిపిస్తూనే ఉంటాయి!

డిసెంబర్ 30 "శ్రీ భగవాన్ రమణ మహర్షి" జయంతి

🌻🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి🌹🌻

🍀రమణ మహర్షి తత్వం : అద్వైత వేదాంతము

🍀ఉల్లేఖన : మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేను అనునది.

🍀శ్రీ రమణ మహర్షి (తమిళం : ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు.బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.

🍀రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.

🌷కుటుంబ నేపథ్యం🌷

🍀శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.

🌷బాల్యం🌷

🍀పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.

🌷బోధనలు🌷

🍀స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

🍀"The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
"In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."

🌷శ్రీ రమణ మహర్షి శిష్యులు🌷

🍀కావ్యకంఠ గణపతిముని

🍀యోగి రామయ్య

🌷భగవాన్ గురించి చలం🌷

🍀భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.

🍀చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, ఒక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! when you were in Thiruvannamalai go for a walk around the hill. The Arunachala hill will gives the power to all the hill itself called (Tejolingam). Shankara charya we sat in the hill and done the mediatation around the hill. if you can for a while into the hill you can catch the power.

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము


👉1. దైవశాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మదైవమా? కానేకాదు కర్మ జడపదార్థం.
👉2. కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది.
👉3. ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధక మవుతాయి.
👉4. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది.
👉5. బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది.
👉6. భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచకజపము కంటే మౌనజపము, మౌనజపము కంటే ధ్యానము ఉత్తమములు.
👉7. నదీ ప్రవాహంలా, నేతి ధారలా, నిరాఘాటంగా సాగే * *సరళధ్యానం *ఆటంకంతో కూడిన విరళచింతనం కన్నా మిన్న.
👉8. పరమాత్మా వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది.
👉9. ద్వైత భావమును దాటి ‘ఆ పరమాత్మే నేను’ నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు.
👉10. మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.
👉11. వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ధ్యానం చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.
👉12. ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.
13. లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును.ధ్యానంలో నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.
👉14. ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.
👉15. మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది?
👉16. దృశ్యవస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్త్వ దర్శనము.
👉17. మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.
👉18. వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.
👉19. నేను అనేది ఎక్కడనుంచి పుడుతోంది? అని అన్వేషిస్తే ఆ నేను పతనమౌతుంది. ఇదే ఆత్మవిచారము.
👉20. ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది నగు ‘అహం అహం’ అను ఆత్మయే ప్రకాశించును.
👉21. అహం వ్రుత్తి లయించినపుడు సదా సత్పదార్థము భాసించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్ధమైయున్నది.
👉22. దేహము, ఇంద్రియములు ప్రాణము,బుద్ధి,అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను.
👉23. సత్తు ను తెల్పుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తూ, చిట్టుయే నేను?
👉24. శరీరాది ఉపాదులవలన జీవేశ్వరులలో భేదము కనుపించు నప్పటికీ ఇద్దరు సత్స్వ రూపులు అవడంవల్ల ఒకే వస్తువై యున్నారు.
👉25. ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది.
👉26. ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును.
27. జ్ఞానము – అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. సమస్తమునకు అతీతమై, సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు ధ్యానం కాక వేరువస్తువు ఏమున్నది.
👉28. తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో, అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును.
👉29. తన్ను తాను తెలుసుకొనెడి ఈ అత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞాని బంధము గాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు.
👉30. నేను అనునదిలేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పల్కుచున్నది.
👉దేహము ఘటము వాలే జడమైనది. దీనికి నే నను తలపు లేనందునను, దేహము లేని నిద్రయందు గూడ దినమును మనముండుట చేతను, దేహము నేను కాదు; నేను ఎవరిని? ఎక్కడనించి వచ్చాను? అని సూక్ష్మ బుద్ధి చేత వెదికిచూచి, ధ్యానం ద్వారా తన యందు నిలకడ జెందినవారల హ్రుదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు ‘అహం’ స్పురణరూపుడై స్వయంగా భాసిల్లుతున్నాడు.ఇదియే పరమపదం.

Thursday 29 December 2016

రుక్మిణీ కళ్యాణం



భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు

వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుం
డనయుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.

విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.

పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు; సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగుబాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు. ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాలు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

శరీరంలోని షట్చక్రాలు….వాటి వివరాలు..



మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః

- వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.

7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం

1. మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.
2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.
3. మణిపూరక చక్రం : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.
4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.
5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.
6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.
7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

Thursday 22 December 2016

బృహస్పతి కవచమ్ (గురు కవచమ్)



అస్య శ్రీబృహస్పతి కవచమహా మంత్రస్య, ఈశ్వర ఋషిః,
అనుష్టుప్ ఛందః, బృహస్పతిర్దేవతా,
గం బీజం, శ్రీం శక్తిః, క్లీం కీలకమ్,
బృహస్పతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్
అభీష్టఫలదం వందే సర్వఙ్ఞం సురపూజితమ్ |
అక్షమాలాధరం శాంతం ప్రణమామి బృహస్పతిమ్ ||

అథ బృహస్పతి కవచమ్
బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః |
కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేభీష్టదాయకః || 1 ||

జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః |
ముఖం మే పాతు సర్వఙ్ఞః కంఠం మే దేవతాగురుః || 2 ||

భుజా వంగీరసః పాతు కరౌ పాతు శుభప్రదః |
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః || 3 ||

నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః |
కటిం పాతు జగద్వంద్యః ఊరూ మే పాతు వాక్పతిః || 4 ||

జానుజంఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా |
అన్యాని యాని చాంగాని రక్షేన్మే సర్వతో గురుః || 5 ||

ఫలశృతిః
ఇత్యేతత్కవచం దివ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వాన్ కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ||

|| ఇతి శ్రీ బృహస్పతి కవచమ్ ||

Sunday 18 December 2016

శివధనుస్సు

Shiva dhanadu


రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే…..

అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం
ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్
అన్నారు.

అంటే…. అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.

ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నది అందరికీ తెలిసినదే! ఈ త్రిపురాసురుడు ఒక జీవుడుని ప్రతిబింబిస్తాడు అని అంతరార్థం ఉంది. అదెలా అంటే, త్రిపురాసురుడు పాలించే మూడు పురములు అయినటువంటి కంచు, వెండి, బంగారములు వరుసగా జీవి యొక్క స్థూల (విశ్వ), సూక్ష్మ (తైజస), కారణ (ప్రాజ్ఞ) శరీరములను ప్రతిబింబిస్తాయి.

స్థూల శరీరం అంటే బాహ్యముగా ఈ విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వుడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు.

సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకి కనిపించే శరీరం. అది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటముగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండిలాంటిది.

కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది లోపల ఏదయితే ఉందో అది. దీనినే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే పై రెండు రకాల శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువయినది.

శివుడు ప్రణవమనే ధనస్సుతో, ఈ మూడు పురములు అనబడే మూడు రకాల శరీరాలని ఒకేసారి ఛేదించాడు. అప్పుడే త్రిపురాసురుడు అనబడే ఈ జీవుని సంహారం జరిగి మరు జన్మ ఉండదు.
ఈ మూడే కాక, మహాకారణ శరీరం అని ఒకటి ఉంది. అది అందరూ గాఢ నిద్రలో అనుభవించే స్థితి. దీనినే తులీయావస్థ అంటారు. ఈ స్థితిని మనం గుర్తించ గలిగి ఆ పరమాత్మలో లయం అవటాన్నే మోక్షం అంటారు. జీవుడిని ఆ మోక్షానికి చేరువ చేసేదే ఓం కారం అయిన ధనుస్సు.

శివుడు ఈ శివధనుస్సుని త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. దీనినే శ్రీరాముడు స్వయంవరంలో విరిచి అప్పుడు సీతమ్మ చేయి అందుకుంటాడు. అనగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ముందు దీనిని విరిచాడు కదా! ఒక మగవాడికి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి అనువయిన, ఉత్తమమయినది ఈ గృహస్థాశ్రమం. ఇందాకా చెప్పుకున్నట్టు ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం కనుక దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం. అలా విడగొడితే వచ్చేవి మళ్ళీ అ, ఉ, మ. వీటిల్లో
అ – అంటే బ్రహ్మం లేదా పరబ్రహ్మం అంటే పరమాత్మ అయిన శివుడు
ఉ – అంటే అమ్మవారు సాక్షాత్తు శివుని అర్థ భాగం
మ – అంటే జీవుడు అంటే నేను అనే మగవాడు

ఏ మగవాడయినా పరమాత్మలో చేరడానికి కావలసిన మాధ్యమం అర్థభాగమయిన, అర్థాంగి అయిన భార్య. మనకున్న ధర్మార్థకామ మోక్షాలలో….
ధర్మం – ధర్మానికి ప్రతిరూపం భార్య ఆవిడ లేకపోతే ఏ పూజలకీ, యాగాలకీ, జపాలకీ, తపస్సులకీ జీవుడు పనికిరాడు.
అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి.
కామం – తనకు కావలసిన కోర్కెలు తీర్చుకోవడానికి భార్య కావాలి.
ఇలా ఎప్పుడయితే, ఏ మగవాడయితే ధర్మాన్నీ, అర్థాన్నీ పాటిస్తూ, ఈ రెండూ చెడకుండా కామాన్ని అనుభవిస్తాడో అతనే మోక్షాన్ని పొందే అర్హత సంపాదిస్తాడు.

రాముడు వీటన్నిటినీ ఆలంబిస్తూ ధనుస్సుని విరిచి తను ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే అర్హతని పొందాడు. కనుకనే అతను సీతకి తగినవాడు, అన్నిటినీ జయించినవాడు కనుక అందరూ సంతోషిస్తారు.

శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.🙏🌺🙏

వివిధ ఆగమ శాస్త్రాల్లో గణపతులు


వివిధ ఆగమ శాస్త్రాల్లో గణపతులు :
ముద్గల పురాణాన్ని అనుసరించి 32 గణపతులు ఉన్నారు.

1.బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి
5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి
9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి
13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి
16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి 21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి
25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి
29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి.

ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.

నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.

*విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.

1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి
3. క్షిప్ర గణపతి 4. వక్రతుండ గణపతి
5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి
7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి
10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి
12. త్రైలోక్య గణపతి 13. హరిద్రా గణపతి
14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి.

ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.

శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...

1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి 5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ
10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి 14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి 18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ.       

             జై భోలో గణేష్ మహరాజ్ కీ....జయ్

Friday 16 December 2016

కనక వర్షం కురిపించే కనకధారా స్తోత్రం

kanakadara lakhsmi
ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు 
చేసిన లక్ష్మీ స్తోత్రం.
దీనిని నిత్యం చదివితే ఐశ్వర్యం 
లభిస్తుందని ఫలశృతి.
శ్రీ శంకరాచార్యులవారు తన బాల్యంలో, భిక్షకు వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక బీదరాలైన స్త్రీ ఇంటికి వెళ్ళగా అక్కడ స్వామికి భిక్ష ఇవ్వడానికి ఆమె గ్గర ఏమీ లేకపోవడం వల్ల తన దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయని తెచ్చి, శంకరాచార్యుల వారికి భిక్షగా వేసింది. ఆమె భక్తికి, శ్రద్దలు చూసిన శంకరాచార్యులు, ఆమె దారిద్యం తొలగడానికి లక్ష్మీ దేవిని స్తుతించారు.
ఆ స్తోత్రానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ బీదరాలి ఇంటిలో కనక దారని కురిపించింది.
ఆ స్తోత్రమే ఈ కనకధారా స్తోత్రం ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది .

శ్రీ కనకధారా స్తోత్రమ్

1.వన్దే వన్దారుమన్దార—మిన్దిరాన్దకందలమ్
అమన్దానందసన్దోహ—బన్ధురం సింధురాననమ్.
2.అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయన్తీ—భృంగాఙ్గనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిలభూతి రపాఙ్గలీలా—మాంగల్యాదా స్తుమమ మఙ్గళదేవతాయాః.
3.ముగ్దా ముహు ర్విదధతీ వదనే మురారేః—ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా—సా మే శ్రియం దిశతు సాగరసమ్భవాయాః.
4.విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష—మానన్దహేతు రధికం మురవిద్విషో పి
ఈష న్ని షీదతు మయిక్షణ మీక్షణార్థం—మిన్దివరోదరసహోదర మిన్ధిరాయాః.
5.ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకున్ద—మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్
ఆకేకరస్థితకనీనికపద్మనేత్రం—భూత్యై భవే న్మమ భుజఙ్గశయాఙ్గనాయాః.
6.కాలామ్బుదాళిలలితోరసి కైటభారే—ర్ధారాధరే స్ఫురతి యా తటిదజ్గ నేవ
మాతు స్సమస్తజగతాం మహనీయమూర్తి—ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః.
7.బాహ్యాన్తరే మురజితః శ్రితకౌస్తుభే యా—హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతో పి కటాక్షమాలా—కల్యాణ మావహతు మే కమలాలయాయాః.
8.ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావత్—మాఙ్గల్యభాజి మధుసలాథిని మన్మథేన
మ య్యాపతే త్తదిహ మన్థర మీక్షణార్థం—మన్దాలసం చ మకరాలయకన్యకాయా.
9.దద్యాద్ధయానుపవనో ద్రవిణాంబుధారా—మస్మిన్నకిఞ్చనవిహఙ్గశిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మ మపనియ చిరాయ దూరం—నారాయణ ప్రణయినీనయనామ్బువహః.
10.ఇష్టా విశిష్టమతయో పియయాదయార్ధ్ర—దృష్టా స్త్రివిష్టపపదం సులభం లభన్తే
దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తి రిష్టాం—పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః.
11.గీర్దేవతేతి గరుడధ్వజసుందరరీతి—శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితా యా—తస్యై నమ స్త్రిభువనైకగురో స్తరుణ్యై.
12.శ్రుత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై—రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై
శక్యై నమోస్తు శతపత్రనికేతనాయై—పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై.
13.నమోస్తు నాళీకనిభాననాయై—నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై
నమోస్తు సోమామృతసోదరాయై—నమోస్తు నారాయణ వల్లభాయై.
14.నమోస్తు హే మామ్బుజపీఠికాయై—నమోస్తు భూమణ్డలనాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై—నమోస్తు శార్ ఙ్గాయుధ వల్లభాయై.
15.నమోస్తు దేవ్యై భృగునందనాయై—నమోస్తు విష్ణో రురసిస్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై—నమోస్తు దామోదర వల్లభాయై.
16.నమోస్తు కాన్త్యై కమలేక్షణాయై—నమోస్తుభూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై—నమోస్తు నందాత్మజ వల్లభాయై.
17.సంపత్కరాణి సకలేంద్రియ నందనాని—సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని—మా మేవ మాత రనిశం కలయంతుమాన్యే.
18.యత్కటాక్ష సముపాసన విధిః—సేవకన్య సకలార్థ సంపదః
సన్తనోతి వచనాంగమానసై—స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే.
19.సరసిజనయనే! సరోజహస్తే!—ధవళతమాంశుక గంధమాల్యశోభే!
భగవతి! హరివల్లభే! మనోజ్ఞే!—త్రిభువనభూతికరి! ప్రసీదమహ్యమ్.
20.దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట—స్రగ్వాహినీ విమలచారు జలప్లుతాంగీం
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష—లోకాధినాథ గృహిణీ మమృతాబ్థిపుత్రీమ్.
21.కమలే కమలాక్షవల్లభే త్వం—కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మామకించనానాం—ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః.
22.బిల్వాటవీమధ్య లసత్సరోజే—సహస్ర పత్రే సుఖ సన్నివిష్టాం
అష్టాపదామ్భోరుహ పాణి పద్మాం—సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీ0మ్.
23.కమలాసన పాణినాలలాటే—లిఖితా మక్షరపంక్తి మస్య జంతోః
పరిమార్జయమాత రంఘ్రిణా తే—ధనికద్వార నివాస దుఃఖదోగ్ద్రీమ్.
24.అంభోరుహం జన్మగృహం భవత్యాః—వక్షస్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే—లీలాగృహం మే హృదయారవిందమ్.
25.స్తువన్తి యే స్తుతిభి రమూభిరన్వహం—త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికాం గురుతర భాగ్యభాజినో—భవంతి తే భువి బుధభావితాశయాః.
సువర్ణధారా స్తోత్రం య—చ్ఛంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం—స కుబేరసమో భవేత్.
ఇతి శ్రీ మచ్చంకర భగవత్కృతమ్ కనకధారా స్తోత్రం


Thursday 15 December 2016

భార్య - భర్తలు ఎలా వుండాలి ?

భార్య - భర్తలు ఎలా వుండాలి ?


పార్వతీ - పరమేశ్వరుల వలె, లక్ష్మీనారాయణుల వలె
సీతా రామచంద్రుల వలె

 కలసి మెలసి వుండవలె!!

 " వాగర్ధావివ  సంపృక్తౌ  వాగర్ధ ప్రతిపత్తయే
 జగతః పితరౌ వందే పార్వతీ (ప)  రమేశ్వరౌ!
                                  ---  మహాకవి కాళిదాసు

భావము:-  వాక్కు నుండి అర్థమును వేరు
చేయలేము కదా !  వాక్కు అర్థము ల వలె
కలసి వుండే పార్వతీ పరమేశ్వరులకు మరియు రమేశ్వరులు అంటే లక్ష్మీనారాయణు
లకు వందనములు !!

భర్త ద్వారా సంతానవతి  అయిన స్త్రీ మాత్రమే పరిపూర్ణురాలవుతుంది !!

మరి మగవాడు పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడు?

ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి!!

శుక్ల యజుర్వేదం లోని “శథపథ బ్రాహ్మణం” లోని క్రింది మంత్రాన్ని చూడండి!!

" అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి సర్వో భవతి!
సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి " (5.2.1.10)

అర్థం :
భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.

కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.

* మనం ఇంకో విషయం గమనిస్తే కనుక ఒకటి అర్థం అవుతుంది.!!
 పై శ్లోకంలో భార్య ద్వారా సంతానం పొందేవాడు మాత్రమే పరిపూర్ణతను పొందుతాడని చెప్పబడింది!!

 అంటే కట్టుకొన్న భార్య ద్వారానే పొందాలి, ఇతరత్రా కాదు అన్న విషయం స్పష్టమవుతోంది!!

ఆది దంపతుల వలె ఆదర్శ దాంపత్య
జీవితాన్ని సాధించి ఆదర్శ హిందూ కుటుంబ
జీవనాన్ని అలవరచుకుందాము !!

శుభమ్ భూయాత్

Tuesday 6 December 2016

స్కందోత్పత్తి గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు

kumara


స్కందోత్పత్తి

1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా! సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! 2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్! ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! 3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా! తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! 4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా! సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!! 5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః! సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! 6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! 7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః! జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!! 8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్! ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!! 9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన! ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!! ౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్! అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!! ౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన! శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!! 12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః! గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!! ౧౩. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్! దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!! ౧౪. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః! సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!! ౧౫. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం! అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం! దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!! ౧౬. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః! ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!! ౧౭. శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం! ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ!! ౧౮. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!! ౧౯. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం! తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!! ౨౦. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ! తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!! ౨౧. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం! సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!! ౨౨. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ! సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం! తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!! ౨౩. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః! క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!! ౨౪. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం! దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!! ౨౫. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్! పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!! ౨౬. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే! స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!! ౨౭. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్! కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!! ౨౮. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్! షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!! ౨౯. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా! అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!! ౩౦. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం! అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!! 31. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా! కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!! ౩౨. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః! ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!! ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!!

*** గర్భవతులు విన్నా, చదివినా  కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.  ***

Friday 2 December 2016

కృష్ణనామ మహత్యం


సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం.
కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.
మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!
నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప /
ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్ //
కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః
జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్ //

కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు. 

కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా /
యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః //

కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే

ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం
నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు.

విధి రాతని ఎవ్వరు తప్పించలేరు కదా అది జగం ఎరిగిన సత్యం? మరి అలాంటప్పుడు పూజలు ఎందుకు?

బ్రహ్మ రాసేటప్పుడే ఒక విషయం చెప్పాడు అదేమిటి అంటే బ్రహ్మ రాసిన బ్రహ్మ తప్పించలేదు కాని ఆ మనిషి తన పాప కర్మలవల్ల,దేవుడి జాపం వల్ల,అఖండమైన పుణ్యకార్యాల వల్ల తన రాతని మార్చుకునే శక్తీ బ్రహ్మ మనకు ఇస్తాడు
lord brahma

ఇదేలగా సాధ్యం

పూర్వం విదుముకుడు అనే రాజు ఉండేవాడు అతను చాల మంచి రాజు అయితే అయనకి 50 ఏళ్ళకి మృత్యు గండం ఉందని జ్యోతిష్కులు మహా పండితులు చెప్తారు,అయితే అయన గురువు ఉపదేశం వల్ల మృత్యుంజయ మంత్రం తెలుసుకుని జపించగా పైగా అతను ప్రజలకు చేసిన పుణ్యకార్యాల వల్ల అపమృత్యు దోషం పోయి ఆయుషు మంతుడు అవుతాడు.

ఎలాగా మనం బ్రహ్మ రాతని మనం మార్చగలం?

గుడిలో అర్చనలు,ప్రదక్షిణాలు,వ్రతాలూ నిత్యం ఇష్టదైవాన్ని జపించడం పురాణాలూ వినడం
బ్రహ్మ రాసిన రాత ఆపదలు తొలగించాలంటే లోకానికి శక్తిని ఇచ్చేది ఆదిపరాశక్తి జగన్మాతా అయితే ఆపదలు వస్తే ఆవిడా పాదాలను స్మరిస్తే ఆవిడా మన కష్టాలను తీర్చి  ఆపదలు దరికి రానీయకుండా చేస్తుంది

షట్పదీ స్తోత్రం భావార్ధం


షట్పదీ స్తోత్రం లో సాధకుడు విష్ణువును ఏమి కోరుతూ ప్రార్థించాలో సూచించారు. ఈ శ్లోకంలో ఆరు ఆరు చిన్న శ్లోకాలు (ఏడో శ్లోకం ముక్తాయింపు) ఉన్నాయి.
ఆరు కాళ్ళు ఉండే తుమ్మేదను షట్పదీ అంటారు. ఆరుశ్లోకాలున్న ఈ స్తోత్రాన్ని షట్పదీ స్తోత్రం అని అంటారు.


శ్లో 1:   అవినయం అపనయ, విష్ణో దమయ మన:శమయ విషయ మృగ తృష్ణామ్,
         భూత దయం విస్తారయ తారయ సంసార సాగరత: ||

అన్న సాధకుడి ప్రార్థన ఈ స్తోత్రంలో మొట్టమొదటి ‘శ్లోకం’. ‘విష్ణుమూర్తి! అహంకారాన్ని తొలగించు. నా మనసును నియంత్రించు. విషయసుఖాల మృగతృష్ణలు శమింపజేయి. నాలో భూతదయను విస్తరింపజేయి. సంసారసాగరం నుంచి దాటించు’. మోక్షసాధనకుమొదటి శత్రువు అవినయం, అహంకారం. మరో శత్రువు మనో నిగ్రహం లేకపోవటం. ఈ రెండు శత్రువులనూ భగవత్కృప వల్ల జయింపవచ్చు అని ఆచార్యుల మతం.


శ్లో 2 :  రెండో శ్లోకంతో, సాధకుడు శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తాడు
          దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
          శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే ||

భవ భయం వల్ల కలిగిన భేదాన్ని ఛేదించేందుకు, నేను శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తున్నాను. అవి ఆకాశగంగా మకరందానికి జన్మస్థానం. దివ్యధుని మకరందాలు. ఆ పాదారవిందాల పరిమళాన్ని అనుభవించటమే సత్-చిత్-ఆనందం.
ఆ తర్వాత సాధకుడు భగవంతుడితో ఇలా అంటాడు; ‘జగన్నాథా, జ్ఞానప్రాప్తి తరవాత మన మధ్య భేదం తొలగి పోతుంది, కానీ అప్పటివరకూ నేను నీ వాడినే గాని నువ్వు నా వాడివి కావు. తరంగం సముద్రంలో భాగం, కానీ సముద్రం తరంగంలో భాగం ఎప్పటికీ కాదు’.

శ్లో 3:  సత్యపిభేదాపగమేనాథతవాహం నమామకీనస్త్వం
          సాముద్రోహి తరంగ: క్వచన సముద్రోనతారంగ:

వేదాంత శ్లోకాలలో కూడా కావ్యశ్లోకాలను మించే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ప్రయోగించటం ఆచార్యుల వారికి అలవాటే. ఈ శ్లోకంలో యమకాలూ, ముక్తపద గ్రస్తాలూ చూడండి:

శ్లో 4:  ఉదృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే
         దృష్టేభవతిప్రభవతి నభవతికీం భవతిరస్కార:

గోవర్ధన నగాన్ని ఉద్ధరణ చేసినవాడా! నగభిత్తు ఇంద్రుడి సోదరుడా! రాక్షసుల అమిత్రా! సూర్యచంద్రులు కన్నులుగలవాడా! నిన్ను దర్శించగా, సమర్థత కలుగుతుంది. భవ దు:ఖనాశనం జరగకుండా ఉంటుందా?

శ్లో 5:   అయిదో శ్లోకం మత్స్యావతారాన్ని స్మరించి
         మత్స్యదిభిరవతారై రావతారవతావతా సదా వసుధాం
         పరమేశ్వరా! పరిపాల్యో భవతా భవథాపభీతోహమ్

ఆ అవతారంలో భూమిని రక్షించినట్టే, ఇప్పుడు భవభయంలో వణుకుతున్న నన్నూ రక్షించమణి వేడుకొంటాడు.

శ్లో 6:   ఆరో శ్లోకంలో కూర్మావతారాన్ని ప్రస్తావించి
         దామోదర! గుణమంధిర! సుందరవదనారవింద! గోవింద
         భవజలధి మధనమందర! పరమందరం మపనయత్వం మే!

భవజలధి మథనానికి నువ్వే కవ్వంగా నిలిచే మందర పర్వతానివి. అపరిమితమైన నా భయాన్ని – ‘పరమం దరం’ – నువ్వే పోగొట్టాలి అని ప్రార్థిస్తాడు.


శ్లో 7 :  నారాయణ! కరుణామయ!, శరణం కరవాణితావకౌచరణౌ
          ఇతి షట్పదీ మదీయే వాదన సరోజే సదా వసతు!

నారాయణా! కరుణానిధీ! నీ చరనద్వయమే శరణు కోరుతాను! ఈ షట్పది, నా ముఖ కమలంలో సదా వసించుగాక! అంటూ షట్పదీ (స్తోత్రం), ముఖ కమలం పదాల వల్ల సిద్ధించిన మనోహరమైన శ్లేషలో ఈ స్తోత్రం ముగుస్తుంది. అంటే కేవలం జ్ఞానమార్గం అవలబించగోరే వేదాంతికికూడా, ఆమార్గంలో సాధన చేసేందుకు కావాల్సిన శమదమాలకు స్వామికృప తప్పదని ఆచార్యులబోధ.

Tuesday 7 June 2016

సర్వసుభాలు కలగాలంటే ఏం చేయాలి?

పసుపు, ఆవాలు, తల పై 7 సార్లు దిగతుడుచుకొని, ఇంటి బయట విసిరి పారవేసి నట్లైతే కార్య సాఫల్యం తప్పక కలుగును , కార్యార్దమై బయటకి వెళ్ళేటప్పుడు.

మారేడు దళమును, అశ్విని నక్షత్ర ఉన్న సమయం లో గోవు ఇచ్చిన పాలతో ఈ దళాలను అలావేసి, సంతానం లేని స్త్రీ కి ఇచ్చిన తప్పక సంతానం కలుగ కలదని సూచిక.

అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో ఉత్తరేణి వేరు తెచ్చి తాయట్టులో కట్టుకొని మీరు ఎవరితోనైనా చర్చలకు వెల్లినట్టైతే చర్చలు సఫలమగును.

ఇంట్లోని వస్తువులు, ఏమైనా, ఎక్కడైనా పెట్టి మరిచిపోయినట్టైన, లేక ఆ వస్తువులు పోయిన " భరణి నక్షత్రము రోజున ,ఒక తమల పాకు తెచ్చి దాని పైకాడపై ఒక్క పెట్టి , ఆ వస్తువు పోయిన ప్రదేశములో ఉంచిన " అది ఎక్కడున్నాడో మీ మనసుకు తెలియును.

పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో, తెల్ల గడ్డి వేరు తెచ్చి మీరు శరీరం పైన ధరించవచ్చు, అలా చేస్తే సుఖవంతమైన జీవితం కలుగును.

పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో, శంఖ పుష్పం తెచ్చి వెండి భరిణలో ఉంచి, కాష్ బ్యాగ్గు లేదా లాకర్లో ఉంచిన ధనం వృద్ది చెందును.

ఆశ్లేషా నక్షత్రం ఉన్న సమయంలో, మర్రిచెట్టు ఆకు తెచ్చి, ధాన్యాగారం లో ఉంచిన. ధాన్యమ వృద్ది చెందును.

ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న సమయంలో, నిమ్మ చెట్టు వేరు తెచ్చి , ఆవుపాల తో కలిపి సంతానం లేని స్త్రీ లకు ఇచ్చిన , సంతానం కలుగు ఆస్కారం ఉన్నది.

అనురాధా నక్షత్రం ఉన్న సమయంలో, సంపెంగ వేరుతెఛి, పిల్ల వాని మేడలో కట్టిన, ఆ పిల్లవాడిని పీడించే అనారోగ్య లక్షణాలు పోవును.

అనురాధా నక్షత్రం ఉన్న సమయంలో, మల్లెతీగ వేరు మేడలో ధరించిన శత్రువులు , మిత్రులు కాగలరు.

శ్రవణా నక్షత్రం ఉన్న సమయంలో , సంతానం లేని స్త్రీ మేడలో ధరింప చేసిన, సంతానం కలుగు ఆస్కారం ఉన్నాడని చెప్పవచ్చు.

కష్టాలు తొలగించే కపాలీశ్వరుడు....???


పరమశివుడి లీలావిశేషాలు చెప్పుకుంటేచాలు పుణ్యరాశి పెరిగిపోతుంది .. మహా పాపాలు సైతం మైనంలా కరిగిపోతాయి. ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు ... ఆయన లీలావిశేషాలకు నిలయాలుగా వెలుగొందుతూ వుంటాయి. ఆయన కొలువైన ప్రతి క్షేత్రం వెనుక పురాణపరమైన కథనం దాగి వుంటుంది. ఆలాంటి ఆసక్తికరమైన కథనం చెన్నై - మైలాపూర్లో వినిపిస్తుంది.

పార్వతీదేవి నెమలి రూపంలో పరమశివుడిని గురించి తపస్సు చేసిన ప్రదేశం కావడం వలన, ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందనేది స్థలపురాణంగా వినిపిస్తూ వుంటుంది. ఇక్కడి సదాశివుడిని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు శివనింద చేస్తాడు. ఆగ్రహించిన ఆదిదేవుడు ఆయన అయిదు తలల్లో తనని నింద చేసిన తలని తీసేస్తాడు. అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడు అయ్యాడు.

తొందరపాటుతో శివ నిందచేసి తాను ఎంతటి పాపానికి పాల్పడినది గ్రహించిన బ్రహ్మదేవుడు, ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించి .. ఆ పాపం నుంచి విముక్తిని పొందాడు. అందువల్లనే ఇక్కడి శంకరుడు 'కపాలీశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. దేవతలు .. మహర్షులు తిరుగాడిన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన, పాపాలు .. శాపాలు .. దోషాలు .. కష్టాలు తీరిపోయి, సుఖశాంతులు లభిస్తాయని చెప్పబడుతోంది. ఒక వైపున పురాణ పరమైన నేపథ్యాన్ని సంతరించుకుని, మరోవైపున చారిత్రక వైభవాన్ని ఆవిష్కరించే ఈ క్షేత్ర దర్శనం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మళ్లీ పుట్టనవసరం లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles